HYDRA: చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదు.. రంగంలోకి రంగనాథ్
- నగరంలోని పలు చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమీషనర్
- చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల రావడంతో తనిఖీలు చేసిన రంగనాథ్
- తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగ్లోని..,
- నెక్నాంపూర్ చెరువుల ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలోని పలు చెరువులను హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల రావడంతో రంగనాథ్ తనిఖీలు చేపట్టారు. నానక్రామ్ గూడకు చేరువలో ఉన్న తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగ్లోని నెక్నాంపూర్ చెరువుల ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతో పాటు.. ఆయా చెరువల్లోకి వరద నీరు చేరకుండా కాలువలను మల్లించడం.. మూసివేయడంపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో క్షుణ్నంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని హైడ్రా అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: TG Cabinet: ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
చెరువులలో మట్టిపోయడంతో పాటు ఆఖరికి వరద కాలువలను కూడా కనిపించకుండా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఖాళీ స్థలంలో వర్షపు నీరు వెళ్లే రహదారులు మూసుకుపోవడంతో తమ అపార్టుమెంట్లోకి వరద నీరు వచ్చి చేరుతోందని స్థానికులు ఆరోపించారు. నానక్ రామ్ గూడ ప్రధాన రహదారికి ఎగువున ఉన్న తౌతాని కుంట చెరువు నీరు.. దిగువవైపు ఉన్న భగీరథమ్మ చెరువుకు వెళ్లే కాలువ లింకు తెగిందని స్థానికులు తెలిపారు.
Read Also: YS Jagan Kadapa Tour: రేపటి నుంచి కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
వరదనీటి కాలువలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, దుకాణాలను తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. చెరువులకు ఆనుకుని ఉన్న స్థలాలు తమవంటూ పలువురు కమిషనర్ను కలువగా.. పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పిస్తే క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైడ్రా కమిషనర్ చెప్పారు. ఇదిలా ఉంటే.. నార్సింగ్ దగ్గర మూసి నది పరీవాహక ప్రాంతాన్ని రంగనాథ్ పరిశీలించారు. కొన్ని నిర్మాణ సంస్థలు మూసి నదిలోకి పోసిన మట్టిని తొలగించాలని ఆదేశించారు. బఫర్ జోన్లో మట్టి పోస్తే ఆయా సంస్థలపై చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!