ఇటీవలే కియా సిరోస్ (Kia Syros EV) ఇండియాకు వచ్చేసింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఇందులో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్ కియా సిరోస్ ఈవీ కూడా తర్వలో లాంచ్ కానుంది. 2026 నాటికి ఇండియాలో ప్రారంభించనున్నారు.
ఐకియా వాహనంలో గంజాయి సరఫరాపై ఐకియా యాజమాన్యం స్పందించింది. తమ వాహనాల్లో మత్తు పదార్థాలను తరలించడాన్ని తీవ్రంగా ఖండించింది. తమ కంపెనీ ఫర్నీచర్ హోం డెలివరీ చేసే ప్రక్రియ థర్డ్ పార్టీ వెండర్ ఆధీనంలో జరుగుతుందని ఐకియా క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటనలో తమకు ఎలాంటి ప్రమేయం ఉండదని తెలిపింది.
చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు! పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న…
నేడు రోజ్గార్ మేళా.. 71 వేల మందికి నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ నేడు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువల జాతర జరగబోతుంది. ఉదయం 10:30 గంటలకు ‘రోజ్గార్ మేళా’లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 71 వేల మంది యువకులకు నియామక పత్రాలను అందించనున్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే రోజ్గార్ మేళా ప్రోగ్రాంలో ప్రధాని వర్చువల్గా పాల్గొని మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల ద్వారా నియామక పత్రాలను…
నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్న సీఎం. ప్రొ కబడ్డీలో నేటి మ్యాచ్లు.. రాత్రి 8 గంటలకు గుజరాత్ వర్సెస్ ఢిల్లీ. రాత్రి 9 గంటలకు పుణెరి-తమిళ్ తలైవాస్. ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ విచారణ. నేడు దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం. మరి కొంతమంది అధికారులను విచారించనున్న ఏసీబీ. కేటీఆర్కు నేడు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈడీ. నేడు పెనమలూరు…
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్స్లో ఆయన పోస్ట్ చేస్తూ.. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, సీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
దాడి ఘటనపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారని.. తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారన్నారు. వారిపై కేసు పెట్టారని చెప్పారు. ఇంటి దగ్గరికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే.. పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై కిమ్స్లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీ తేజ్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈరోజు సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన బండి సంజయ్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ పురందేశ్వరిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో అల్లు అర్జున్ పై ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. అల్లు అర్జున్ విషయంలో తమకు ఎలాంటి కక్షసాధింపు లేదని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
అల్లు అర్జున్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమా దేశ వ్యాప్తంగా అత్యధిక డబ్బులు వసూళ్లు చేసిందని అన్నారు. ఆయన సినిమా వల్ల ఓ మహిళ చనిపోతే 25 లక్షల రూపాయలు బిక్షం వేస్తున్నారా...? అని పేర్కొన్నారు. ఒక జీవితం ఖరీదు 25 లక్షలా..? ప్రశ్నించారు. అల్లు అర్జున్ కొడుకు చనిపోతే రూ.25 లక్షలు ఇస్తే ఊరుకుంటాడా..? అని అన్నారు.