U23 State Trophy: మెరిసిన యువ సంచలనం.. 21 పరుగులిచ్చి 8 వికెట్లు తీసిన ఢిల్లీ ప్లేయర్
- అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో యువ స్పిన్నర్ అద్భుత ప్రదర్శన 7.4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టిన ఢిల్లీ స్పిన్నర్ రౌనక్ బఘేలా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీసీఐ నిర్వహిస్తున్న పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో యువ స్పిన్నర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రాంచీలోని మెకాన్ స్టేడియంలో జరిగిన 50 ఓవర్ల వన్డే మ్యాచ్లో ఢిల్లీ అండర్-23 జట్టు 8 వికెట్ల తేడాతో కేరళ అండర్-23పై విజయం సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు రౌనక్ బఘేలా ధాటికి 25.4 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ రౌనక్ బఘేలా 7.4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి కేవలం 21 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుత ప్రదర్శతో కేరళ జట్టు కుప్పకూలింది. అనంతరం 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. ఆయుష్ దోసెజా (59), అర్పిత్ రాణా (38) అద్భుతమైన ఇన్నింగ్స్తో కేవలం 11.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రౌనక్ బఘేలా అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్కు పోలీసుల నోటీసులు
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
రౌనక్ బఘేలా బౌలింగ్ పట్ల అతని కోచ్ దేవదత్ బాఘెల్ మాట్లాడుతూ.. అతనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించాడు. అతను అద్భుతమైన బౌలర్ అని చెప్పాడు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ఈ ఆటగాడు.. తన కృషి, అంకితభావంలో ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదని అన్నాడు. అతను ఢిల్లీకి చెందిన రవీంద్ర జడేజా అని కోచ్ చెప్పాడు. రౌనక్ బఘేలా బ్యాట్, బాల్ రెండింటిలోనూ బాగా రాణిస్తున్నాడు. మరోవైపు.. సమీర్ రిజ్వీ ఇటీవల డబుల్ సెంచరీ సాధించాడు. దేశవాళీ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. త్రిపురతో జరిగిన పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్కు కెప్టెన్గా ఉన్న రిజ్వీ కేవలం 97 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, 20 సిక్సర్లు ఉన్నాయి. రిజ్వీ తన ఇన్నింగ్స్తో రికార్డులను బద్దలు కొట్టాడు. సమీర్ రిజ్వీ అద్భుత ఆటతీరుతో ఉత్తరప్రదేశ్ త్రిపురను భారీ తేడాతో ఓడించింది.
Read Also: Central Minister Rammohan Naidu: శరవేగంగా పనులు. జూన్ 2026కే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి..
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!