U23 State Trophy: మెరిసిన యువ సంచలనం.. 21 పరుగులిచ్చి 8 వికెట్లు తీసిన ఢిల్లీ ప్లేయర్
- అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో యువ స్పిన్నర్ అద్భుత ప్రదర్శన 7.4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టిన ఢిల్లీ స్పిన్నర్ రౌనక్ బఘేలా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీసీఐ నిర్వహిస్తున్న పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో యువ స్పిన్నర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రాంచీలోని మెకాన్ స్టేడియంలో జరిగిన 50 ఓవర్ల వన్డే మ్యాచ్లో ఢిల్లీ అండర్-23 జట్టు 8 వికెట్ల తేడాతో కేరళ అండర్-23పై విజయం సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు రౌనక్ బఘేలా ధాటికి 25.4 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ రౌనక్ బఘేలా 7.4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి కేవలం 21 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుత ప్రదర్శతో కేరళ జట్టు కుప్పకూలింది. అనంతరం 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. ఆయుష్ దోసెజా (59), అర్పిత్ రాణా (38) అద్భుతమైన ఇన్నింగ్స్తో కేవలం 11.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రౌనక్ బఘేలా అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్కు పోలీసుల నోటీసులు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
రౌనక్ బఘేలా బౌలింగ్ పట్ల అతని కోచ్ దేవదత్ బాఘెల్ మాట్లాడుతూ.. అతనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించాడు. అతను అద్భుతమైన బౌలర్ అని చెప్పాడు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ఈ ఆటగాడు.. తన కృషి, అంకితభావంలో ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదని అన్నాడు. అతను ఢిల్లీకి చెందిన రవీంద్ర జడేజా అని కోచ్ చెప్పాడు. రౌనక్ బఘేలా బ్యాట్, బాల్ రెండింటిలోనూ బాగా రాణిస్తున్నాడు. మరోవైపు.. సమీర్ రిజ్వీ ఇటీవల డబుల్ సెంచరీ సాధించాడు. దేశవాళీ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. త్రిపురతో జరిగిన పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్కు కెప్టెన్గా ఉన్న రిజ్వీ కేవలం 97 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, 20 సిక్సర్లు ఉన్నాయి. రిజ్వీ తన ఇన్నింగ్స్తో రికార్డులను బద్దలు కొట్టాడు. సమీర్ రిజ్వీ అద్భుత ఆటతీరుతో ఉత్తరప్రదేశ్ త్రిపురను భారీ తేడాతో ఓడించింది.
Read Also: Central Minister Rammohan Naidu: శరవేగంగా పనులు. జూన్ 2026కే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!