Telangana: లోక్సభ షెడ్యూల్ విడుదలైంది. ఇక పోరు మిగిలింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల కావడంతో ఇకపై తెలంగాణలో పోరు మరింత హీటెక్కనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ పర్యటన తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు. మార్చి 15న హైదరాబాద్ ప్రచారానికి అమిత్ షా రాబోతున్నారు. మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. బీజేపీ…
ఏపీతో పాటు తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అక్కడి స్థానం ఖాళీ కాగా.. ఆ అసెంబ్లీ స్థానానికి కూడా మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Group-1 Exam: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అప్లికేషన్లకు గడువు ఈ నెల 14నే ముగిసినా.. TSPSC రెండు రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే.
Telangana Weather: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. భానుడు భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఐఎండీ చల్లటి కబురు చెప్పింది.
PM Modi:పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరగనుంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పాలమూరు-నాగర్ కర్నూల్-నల్గొండ పార్లమెంట్ స్థానాలకు కలిపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.