Telangana Storms: రాష్ట్రంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. మెదక్ జిల్లాలో ఊయలలో ఆడుతున్న చిన్నారి ఈదురు గాలులకు ఎగిరి పక్కనే ఉన్న డాబాపై పడి మృతి చెందగా, సిద్దిపేట జిల్లాలో చెట్టు కూలడంతో టెన్త్ విద్యార్థి మృతి చెందాడు.
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుందని అధికారులు వెల్లడించారు.
TS AP Rains: హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వరుణుడు చల్లబడ్డాడు. చల్లటి గాలులు, చిరు జల్లులు హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఈ చలి మరో మూడు నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉదయం నుంచి ఎండలు మండుతున్నప్పటికీ…
తెలంగాణ ప్రజలనుద్దేశించి మాజీ గవర్నర్ తమిళిసై ఓ సందేశం ఇచ్చారు. నా ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా.. నేను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి వైదొలగుతున్నప్పుడు, అనేక భావోద్వేగాలతో మునిగిపోయాను. ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందం కలిగించింది. అన్నింటికీ మించి తెలంగాణాలోని నా సోదర సోదరీమణుల ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుందని తెలిపారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో.. ప్రజలు రిలాక్స్ అవుతున్నారు. కొండపూర్, మియాపూర్, చందానగర్, ఆర్సీపూరం, బీరంగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.