పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telegram: సినిమాలు, వెబ్సిరీస్లు, ఇతర కాపీరైట్ కంటెంట్ పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ (Telegram)కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) నోటీసు జారీ చేసింది. పైరసీ కంటెంట్ను వెంటనే తొలగించి, తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా “యాక్షన్ టేకెన్ రిపోర్ట్” (ATR) సమర్పించాలని ఆదేశించింది.
భారత క్రియేటర్ ఎకానమీ, సినీ పరిశ్రమ, టెలివిజన్ ప్రసార సంస్థలు, ఓటీటీ వేదికలు, నిర్మాతలు, పంపిణీదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. పైరసీకి పాల్పడుతున్న ఛానళ్లు, గ్రూపులు, బాట్లు, ఖాతాలు, అడ్మినిస్ట్రేటర్లు, అనుబంధ సంస్థలపై కూడా టెలిగ్రామ్ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన!
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Rammohan Naidu: ప్రపంచమే మన దగ్గర ఉన్న అనుభూతి.. భోగాపురం ఎయిర్పోర్ట్పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
- 6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
ఈ మధ్యకాలంలో పలు ఓటీటీ సంస్థలు, కంటెంట్ యజమానులు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. తమ కాపీరైట్ కలిగిన సినిమాలు, వెబ్సిరీస్లు టెలిగ్రామ్లో అనుమతి లేకుండా విస్తృతంగా షేర్ అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్రం మొత్తం 3,142 టెలిగ్రామ్ ఛానళ్లు పైరసీ కంటెంట్ను పంపిణీ చేస్తున్నట్లు గుర్తించింది. దీనితో సమాచార సాంకేతిక చట్టం-2000 (IT Act, 2000) కింద టెలిగ్రామ్కు నోటీసులు జారీ చేశారు. కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించిన కంటెంట్ను తొలగించడంతో పాటు.. మధ్యవర్తి సంస్థగా (Intermediary) తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్రం స్పష్టం చేసింది.
సమాచార సాంకేతిక (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు-2021 ప్రకారం, ప్రభుత్వం లేదా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు అక్రమ కంటెంట్ను తొలగించడం ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు తప్పనిసరి. ఈ నిబంధనలను టెలిగ్రామ్ కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం తెలిపింది. అలాగే.. ప్రతి పైరసీ ఛానల్ను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి చెప్పే వరకు వేచి ఉండకూడదని కూడా కేంద్రం హెచ్చరించింది. టెలిగ్రామ్ స్వయంగా పర్యవేక్షణ చేపట్టి, పైరసీ కార్యకలాపాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.
గత కొంతకాలంగా టెలిగ్రామ్పై భారత్లో పలు వివాదాలు తలెత్తుతున్నాయి. మోసాలు, వ్యక్తుల పేర్లతో నకిలీ ఖాతాల నిర్వహణ, సున్నితమైన సమాచార ప్రసారం వంటి అంశాలపై ఇప్పటికే కేంద్రం నిఘా పెంచింది. ముఖ్యంగా నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్ సేవలపై గతంలో కేంద్రం తాత్కాలికంగా నిషేధం కూడా విధించింది. ఇప్పుడు పైరసీ అంశంపై కేంద్రం తీసుకున్న తాజా చర్యతో డిజిటల్ ప్లాట్ఫామ్ల బాధ్యతపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టంగా కనపడుతుంది.
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన!
-
Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
-
Dharani I Love You: సెంటిమెంట్ పాటను ఆలపించిన పట్నాయక్.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణ!
-
Khalifa Trailer: ‘ఖలీఫా’ ట్రైలర్ ఔట్.. బంగారం, స్మగ్లింగ్, ప్రతీకారంతో పృథ్వీరాజ్ మాస్ వార్!
-
LPG e-KYC: ఎల్పీజీ e-KYC గడువు ముగిసింది.. ఇప్పుడు ఏం చేయాలి? కనెక్షన్ రద్దవుతుందా? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!