Srinivas Goud: ఎన్నికల హామీలను కాంగ్రెస్ మరిచిపోయింది
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మానకొండుర్లో ఎండిన పంటలకు ఎకరానికి 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రైతు దీక్ష కార్యక్రమం చేపట్టింది., మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, రసమయి బాలకిషన్, పలువురు నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కరవు వచ్చిందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు కరవు రాలేదన్నారు. గత పదేళ్లలో రైతులకు కష్టాలు రాలేదని.. కాంగ్రెస్ వచ్చిన వంద రోజుల్లోనే కష్టాలు వచ్చి పడ్డాయని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలతో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిందని పేర్కొన్నారు. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? కాంగ్రెస్ను గద్దె దింపుదామా అని ఎదురుచూస్తున్నారన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఎండిన పంటలకు నష్టానికి ఎకరానికి రైతులకు రూ.25000 వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రకారం యాసంగి సీజన్ నుంచి రైతులకు 500 బోనస్ ఇవ్వాలని కోరారు. చివరి దశలో ఉన్న పంటలను కాపాడేందుకు రైతులకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే తక్షణమే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. రైతుల పక్షాన ముందు ముందు ఏ పోరాటానికైనా బీఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని నాయకులు ప్రకటించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!