KTR: కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: వ్యవసాయం సంక్షోభంలో ఉందని, మన ప్రభుత్వం పోయి నాలుగు నెలల్లో ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం తెలంగాణ భవన్లో రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతుతో సమానమని కేటీఆర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు 500 బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని అంటున్నారని.. చిత్తశుద్ది ఉంటే ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాయాలని, తాము కూడా ఉత్తరం రాస్తామన్నారు. కరువు వస్తే మమ్ములను తిడుతారా అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారన్నారు. ఈ ఏడాది 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యిందని.. కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అంటూ ఆయన ఆరోపించారు. మేడిగడ్డ నుంచి రోజూ 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే రిపేరు చేయకుండా కేసీఆర్ను బదనాం చేస్తున్నారన్నారు.
Read Also: Mission Bhagiratha: మిషన్ భగీరథ నిర్వహణ సంస్థలతో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ భేటీ
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారని.. కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలనకు వెళితే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో రెండు పిల్లర్లు రిపేరు చేస్తే తెలంగాణలో కరువు రానే రాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందన్నారు. రైతుల హక్కుల తరపున కొట్లాడుదామని ఆయన బీఆర్ఎస్ నేతలకు, రైతులకు పిలుపునిచ్చారు. ప్రజలకు మొండి చేయి చూపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయని భ్రమలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దగాకోరు అని ప్రజలకు వివరించి చెబుతామన్నారు. రేపటి నుండి కండువా వేసుకొని రైతులకు వచ్చే బోనస్పై కాంగ్రెస్ పార్టీని నిలదీద్దామని కేటీఆర్ రైతులకు సూచించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగితే.. రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నామని ఆయన ప్రశ్నించారు. నేతన్నల కొరకు తాము పోరాటం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి గుంపుమేస్త్రీ, ప్రధానమంత్రి తాపీమేస్త్రీ అంటూ విమర్శించారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?