KTR: కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: వ్యవసాయం సంక్షోభంలో ఉందని, మన ప్రభుత్వం పోయి నాలుగు నెలల్లో ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం తెలంగాణ భవన్లో రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతుతో సమానమని కేటీఆర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు 500 బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని అంటున్నారని.. చిత్తశుద్ది ఉంటే ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాయాలని, తాము కూడా ఉత్తరం రాస్తామన్నారు. కరువు వస్తే మమ్ములను తిడుతారా అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారన్నారు. ఈ ఏడాది 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యిందని.. కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అంటూ ఆయన ఆరోపించారు. మేడిగడ్డ నుంచి రోజూ 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే రిపేరు చేయకుండా కేసీఆర్ను బదనాం చేస్తున్నారన్నారు.
Read Also: Mission Bhagiratha: మిషన్ భగీరథ నిర్వహణ సంస్థలతో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ భేటీ
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారని.. కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలనకు వెళితే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో రెండు పిల్లర్లు రిపేరు చేస్తే తెలంగాణలో కరువు రానే రాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందన్నారు. రైతుల హక్కుల తరపున కొట్లాడుదామని ఆయన బీఆర్ఎస్ నేతలకు, రైతులకు పిలుపునిచ్చారు. ప్రజలకు మొండి చేయి చూపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయని భ్రమలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దగాకోరు అని ప్రజలకు వివరించి చెబుతామన్నారు. రేపటి నుండి కండువా వేసుకొని రైతులకు వచ్చే బోనస్పై కాంగ్రెస్ పార్టీని నిలదీద్దామని కేటీఆర్ రైతులకు సూచించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగితే.. రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నామని ఆయన ప్రశ్నించారు. నేతన్నల కొరకు తాము పోరాటం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి గుంపుమేస్త్రీ, ప్రధానమంత్రి తాపీమేస్త్రీ అంటూ విమర్శించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!