Hit and Run: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై హిట్ అండ్ రన్.. ఇద్దరు యువకులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hit and Run: కొందరు యువత సెల్ఫీల కోసం ప్రమాదకర పనులు చేస్తుంటారు. కొంత మంది లైక్స్ రావడానికి.. ఫేమస్ కావడానికి రీళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం ఇద్దరు వెళ్లారు. ఈ క్రమంలో ఓ కారు వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం శుక్రవారం మాదాపూర్లో చోటుచేసుకుంది. అనిల్ , అజయ్ లు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో రోడ్డుపైకి వచ్చే వాహనాలను పట్టించుకోలేదు. అర్ధరాత్రి 12.30 గంటలకు కేబుల్ వంతెన వద్దకు చేరుకున్నారు.
Read also: Sneha Ullal : హారర్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్నేహా ఉల్లాల్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న సీన్స్…
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
ఈ క్రమంలో AP28DV7999 ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది. కారు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మాదాపూర్ పేస్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే అనిల్ మృతి చెందాడు. చికిత్స పొందుతూ విజయ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కేబుల్ వంతెనపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేబుల్ బ్రిడ్జిపై ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని, సెల్ఫీలు దిగే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. కానీ.. ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
Top Headlines @1PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!