ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిన్న రాహుల్ గాంధీ వరంగల్కు రావాలి అనుకొని కూడా రాలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వరంగల్ ప్రజలు అడుగుతారఅని రాహుల్ రాలేదన్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ హామీలు నెరవేర్చే వరకు వెంటబడతాం అని హెచ్చరించారు. మార్చి 8న మహిళా శంఖారావం జరగబోతోందని, ఇందిరా పార్కు దగ్గర జరిగే ఈ మీటింగ్లో మహిళల సత్తా చాటుతాం అని కవిత…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే ముందుకూ వెళ్తామని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం అని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్ధుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని తాను స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి పోకడకు వెళ్లకుండా…
నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి రోగి ప్రాణాన్ని కాపాడారు. వికారాబాద్ జిల్లాకు చెందిన పేషంట్ వి.కవిత (35)కు యూరాలజిస్ట్ డాక్టర్లు ఎలెక్టివ్ హిస్టరీ సిజేరియన్ ఆపరేషన్, హిస్టరీ విత్ బ్లాడర్ రిపేర్ చేశారు. ఈ నెల 1వ తేదీన తీవ్ర రక్తస్రావంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి కవిత కుటుంబ సభ్యులు నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. 27 వారాల గర్భవతి అయిన కవిత.. ఇన్ బ్రాకెట్స్ జి ఫోర్, ప్లాసెంటా పర్క్రిటా విత్…
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ‘మేడారం’ సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం (ఫిబ్రవరి 12) నుంచి ప్రారంభం కానుంది. వనదేవతలు సమ్మక్క-సారలమ్మ చిన్నజాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరగనుంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. మధ్యలో వచ్చే ఏడాది మాత్రం మినీ జాతరగా నిర్వహిస్తారు. మినీ జాతర భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఈరోజు మండమెలిగే పండుగతో మినీ జాతరను ప్రారంభిస్తారు. గురువారం మండమెలిగే పూజలు, శుక్రవారం భక్తుల…
మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. పట్టభద్రుల స్థానానికి దాఖలైన 100 నామినేషన్లలో 32 తిరస్కరణ అయ్యాయి. మరోవైపుకు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి దాఖలయిన నామినేషన్లలో ఓ నామినేషన్ తిరస్కరణ అయింది. మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 100 మంది నామినేషన్ వేయగా.. 32 మంది నామినేషన్లు వివిధ కారణాల చేత ఎన్నికల…
నంగునూర్ (మం) కొనాయిపల్లిలో వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ యాదాద్రితో సహా ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారని తెలిపారు. రేవంత్ సర్కార్ 15 నెలల్లో దేవాలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని వెల్లడించారు. దేవుళ్ళపై ప్రమాణం చేసి మాట తప్పిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని…
తెలంగాణలో కులగణన తప్పుల తడక అని బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య విమర్శించారు. అన్ని ఇళ్లకు వెళ్లకుండా కులగణన చేశారని, ప్రభుత్వం తూతూ మంత్రంగా కులగణన చేసిందని మండిపడ్డారు. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళితే ఒప్పుకోమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పినకు అసెంబ్లీలో చట్టం చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. Also Read: Road Accident: జబల్పుర్ రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సహాయక…