Narasapur: డంపింగ్యార్డ్కు వ్యతిరేకంగా నర్సాపూర్ లో బంద్..
- నర్సాపూర్ లో ప్యారానగర్ ప్రాంతంలో GHMC డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బంద్కు పిలుపు
- ప్యారానగర్లో డంప్ యార్డు ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి ఆందోళనలు
- డంప్ యార్డుతో నర్సాపూర్ రాయరావు చెరువులో వ్యర్థజలాలు కలుషితమవుతాయని ఆందోళన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narasapur: నర్సాపూర్ టౌన్లో ప్రస్తుతం జరుగుతున్న బంద్ తీవ్ర ఉద్వేగం సృష్టిస్తోంది. అఖిలపక్షం ప్యారానగర్ ప్రాంతంలో GHMC డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చింది. ప్యారానగర్లో డంప్ యార్డు ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి అనేక ఆందోళనలు వస్తున్నాయి. దీనితో స్థానిక ప్రజలంతా ఈ డంప్ యార్డుతో సంబంధించిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డుతో నర్సాపూర్ రాయరావు చెరువులో వ్యర్థజలాలు కలుషితమవుతాయని తెలుపుతున్నారు. ఈ కారణంగా పంట పొలాలు, నీటి వనరులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Road Transport and Highways: తెలంగాణకు 176.5 కోట్లు విడుదల
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
బంద్కు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు, స్కూళ్లు కూడా మద్దతు ఇవ్వడం అక్కడి పరిస్థితిని మరింతగా తీవ్రతరం చేస్తుంది. గుమ్మడిదల (మం) గ్రామం నల్లవల్లి ప్రాంతంలోని గ్రామస్థులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అక్కడ వారు సెల్ఫీ వీడియోలు తీసి తమ నిరసనను ప్రజలకు అందించారు. ఈ విషయంలో నర్సాపూర్ BRS ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. “ప్యారానగర్ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్మించడానికి ప్రతిపక్షాలపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇది పచ్చని పంటలను పాడుచేస్తుందని” అన్నారు. డంపింగ్ యార్డు నిర్మాణం ఆపకుంటే, లగచర్ల తరహాలో పోరాటం తప్పదని ఆమె హెచ్చరించారు.
Also Read: Mulugu: గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మృతి.. స్పందించిన మంత్రి
BRS ప్రభుత్వం డంపింగ్ యార్డుకు కేవలం అనుమతులు మాత్రమే ఇచ్చింది. కానీ, పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదని తెలిపారు. అర్ధరాత్రి ఇంట్లో పడుకున్న వాళ్ళని అరెస్ట్ చేసి, రాత్రి సమయంలో పెద్దఎత్తున పనులు చేయడం ప్రజల మనసులు ద్రోహం చేస్తున్నట్లు కనిపిస్తుంది.ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రజలను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ప్రజల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డు నిర్మాణం వల్ల పర్యావరణ కాలుష్యం, నీటి కాలుష్యం వంటి సమస్యలు మరింత విస్తరించనున్నాయి.
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!