Inter Board : తెలంగాణ ఇంటర్ బోర్డు సంచలనం.. ప్రాక్టికల్ సెంటర్లో సీసీ కెమెరాలు
- ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
- ప్రాక్టికల్ జరిగే ఎగ్జామ్ సెంటర్ లకు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం
- ప్రతి ప్రాక్టికల్ సెంటర్ లో సీసీ కెమెరా ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter Board : తెలంగాణలో ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలున్నాయి. దీంతో స్వల్ప సంఖ్యలో కాలేజీలు సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తే.. వాటికి పరీక్ష కేంద్రాలు ఇవ్వబోమని బోర్డు అధికారులు హెచ్చరించారు.
Plane Crash: మధ్యప్రదేశ్లో కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లకు గాయాలు
Also Read
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
ఈ నేపథ్యంలోనే.. ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ప్రాక్టికల్ జరిగే ఎగ్జామ్ సెంటర్ లకు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రాక్టికల్ సెంటర్ లో సీసీ కెమెరా ఏర్పాటు చేశామని, అక్రమాలు జరగకుండా, అపోహలు తొలగించడం కోసం సీసీ కెమెరా లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. థియరీ ఎగ్జామ్స్ లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయని కృష్ణ ఆదిత్య తెలిపారు. 90 శాతం సెంటర్ లలో సీసీ కెమెరా లు ఏర్పాటు చేశామని, ఎవరైనా విద్యార్థులు గైర్హాజరు అయిన సరిఅయిన కారణాలు చూపితే ప్రాక్టికల్స్ కి అనుమతి ఇస్తున్నామన్నారు. అన్ని సెంటర్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, కాలేజీలు సహకరిస్తున్నాయని ఆయన తెలిపారు. థియరీ ఎగ్జామ్ సమయంలో పేపర్ ఓపెన్ చేసే రూం లో, సెంటర్ ఎంట్రన్స్ లో, కారిడార్ లో, గ్రౌండ్ లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
CM Revavnth Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్రూమ్ వార్ అదిరింది
-
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!