Home
Telangana
Telangana News
-
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..
కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగానికి తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే తెలంగాణ ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా… తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ ఫలితాలు విడుదల చేసింది. read also : రైతులకు పంట రుణాలు అందించడంపై తెలంగాణ… -
బీజేపీ లో ముసలం… సొంతపార్టీ నేతలపై మోత్కుపల్లి ఫైర్
బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి సొంతపార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ను బీజేపీలోని కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని… అధ్యక్షుడు బండి సంజయ్ కి చెప్పే దళిత సమావేశానికి హాజరయ్యానని స్పష్టం చేశారు. సీఎం ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి వెళ్ళి బీజేపీని బ్రతికించానని.. ప్రగతి భవన్ సమావేశానికి వెళ్ళకుంటే బీజేపీకి తీవ్ర అపవాదు వచ్చేదన్నారు. దళిత వ్యతిరేక పార్టీగా బీజేపీ పైనున్న ముద్రను పోగొట్టే ప్రయత్నం చేశానని.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నాకు… -
పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్, సీఎం కేసీఆర్…
దేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టి అన్ని దేశాలతో సమానంగా అభివృద్ది చెందేందుకు కృషిచేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఏడాదిగా శతజయంతోత్సవాలను నిర్వహించిది. ఈరోజు పీవీ జయంతితో శత జయంతి ఉత్సవాలకు ముగింపుపలికారు. ఇందులో భాగంగా ఇప్పటికే నెక్లెస్ రోడ్ని పీవీ మార్గ్ మార్చింది ప్రభుత్వం. పీవీ మార్గ్ లో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఈరోజు ఉదయం11 గంటలకు గవర్నర్… -
విద్యాశాఖ అధికారులతో మంత్రి సబిత కీలక సమీక్ష…
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి సాధారణ జీవనం ప్రారంభం అయింది. దీంతో జులై 1 వ తేదీనుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాలేజీలు తిరిగి రీ ఓపెన్ చేశారు. జులై 1 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో విద్యాశాఖ అధికారుతలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సమీక్షను నిర్వహించబోతున్నారు. విద్యాసంస్థలు, ఆన్లైన్ క్లాసులు, మార్గదర్శకాలపై సమీక్షించబోతున్నారు. అదేవిధంగా, జులై నెలలోనే డిగ్రీ, పీజీ పరీక్షలు జరగాల్సి ఉన్నది.… -
నేడు పీవీ జయంతి…ఘనంగా జయంతోత్సవాలు…
దేశంలో సంస్కరణలు తీసుకొన్ని, అభివృద్దిబాటలో నడిపించిన ప్రధానీ పీవీ నరసింహారావు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి మరణం తరువాత, కాంగ్రెస్ పార్టీలో, దేశంలో నెలకొన్న అనిశ్చితి తొలగించేందుకు సమర్ధుడైన వ్యక్తిని ప్రధానిగా నియమించాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. పీవీ ప్రధాని అయ్యాక, అనేక సంస్కరణలు తీసుకురావడంతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా అడుగులు వేసింది. పీవీ నరసింహారావు తెలుగు వారు కావడం, అందులోనూ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్రంలో గత ఏడాది కాలంగా… -
మళ్ళీ మునిగిన హైదరాబాద్…
హైదరాబాద్ నగరం మళ్ళీ మునిగింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్య కుంట నిండి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దయానంద్ నగర్, సాయి చరణ్ కాలనీ ఇళ్లలోకి నీరు చేరడంతో ప తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇంట్లో ఉన్న వస్తువులు బియ్యం, బట్టలు తడిసి పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. అయితే గత ఏడాది కురిసిన వర్షాల నుంచి జీహెచ్ఎంసీ గుణపాఠం నెరవలేదు అనిపిస్తుంది. నాలాల పూడికతీత పూర్తి కాకపోవడంతో మళ్ళీ మునిగిపోయింది హైదరాబాద్.… -
తెలంగాణలో వెయ్యికి దిగువగా కరోనా కేసులు…
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 748 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,20,613 కి చేరింది. ఇందులో 6,02,676 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,302 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో… -
చర్యలు తీసుకుంటున్నా మార్పులేని ఖాకీలు…?
ఆ జిల్లాలో తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నా.. సిబ్బందిలో మార్పు రావడం లేదట. అదేపనిగా ఆరోపణలు.. చర్యలు కామనైపోయాయి. ఒకప్పుడు చిన్న మెమో ఇస్తేనే గిల్టీగా ఫీలయ్యే సిబ్బంది.. ఇప్పుడు సస్పెండ్ చేసినా ఎందుకు లైట్గా తీసుకుంటున్నారు? నెలరోజుల వ్యవధిలోనే నలుగురిపై ఆరోపణలు! నల్లగొండ జిల్లా దేవరకొండ పోలీస్ సబ్డివిజన్ పరిధిలో పది స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేస్తున్న SIలు, CIలు, కానిస్టేబుళ్లపై ఏదో ఒక ఆరోపణలు రావడం.. వేటు పడటం ఈ మధ్య… -
కేసీఆర్ కి బుద్ది చెప్పాలి : మాజీ మంత్రి చంద్రశేఖర్
20 ఏళ్ళ నుండి రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నం. రాష్ట్రం ఏర్పడితే దళితులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనుకున్నారో అవి జరగడం లేదు. ఉద్యమంలో చెప్పనవి కూడా చేస్తునమ్ అంటున్నారు కేసిఆర్.. కానీ చెప్పనవి ఎందుకు చేయడం లేదు అన్నారు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్. ఉద్యమం లో పాల్గొన్న అందర్నీ ఏకం చేయడానికి సమావేశం అయ్యాం. కేసీఆర్ కి బుద్ది చెప్పాలి.. అందుకే ఎన్నికలు వస్తాయని తెల్సిన వెంటనే సమావేశం అవుతున్నం. 7 సంవత్సరాల గడుస్తున్నా రాష్ట్రంలో… -
40 వేల కోట్లు దళితుల కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధం
తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలి అని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికది గా సిద్ధం చేసుకోవాలి అని అన్నారు. 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి…
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!