Home
Telangana
Telangana News
-
ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట.. ఆ కేసు కొట్టివేత..
మానుకోట ఎంపీ కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.. కవితపై గతంలో నమోదైన కేసును కొట్టివేసింది కోర్టు.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేశారంటూ 2019లో కవితపై కేసు నమోదైంది.. ఈ కేసులో విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానాను గతంలో విధించింది.. అయితే, ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు కవిత.. అయితే, ఇప్పటికే ఈ కేసులో విచారణ జరిపిన… -
కేఆర్ఎంబీకి తెలంగాణ మరో లేఖ.. ఈ సారి ఈ విషయాలపై…
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తూనే ఉంది… మూడు ఫిర్యాదులు, ఆరు లేఖలు అన్నచందంగా ఈ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది.. తాజాగా, మరో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి మరో లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. ఇక, ఈ సారి లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్ కు మాత్రమే అనుమతించిందని గుర్తుచేశారు.. ఎస్కేప్ రెగ్యులేటర్ అనేది తరువాతి కాలంలో… -
గణేష్ ఉత్సవాలు.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటన..
వినాయక ఉత్సవాలు, నిమజ్జనానికి హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది.. అయితే, గణేశ్ ఉత్సవాల నిర్వాహణపై తెలంగాణ, నిమజ్జనం పై ఆంక్షలు విధించింది హైకోర్టు.. ఈ నేపథ్యంలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావ్.. హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా తమకు అందలేదన్న ఆయన.. ఈ సారి సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.. ఈ నెల 19న సామూహిక నిమజ్జనం ఉంటుందని.. హుస్సేన్ సాగర్… -
సవాళ్లతో వేడెక్కించిన స్పీకర్ పోచారం !
ఆయనో పెద్దపదవిలో ఉన్నారు. ఆ పదవి చేపట్టాక నియోజకవర్గం దాటి వెళ్లింది లేదు. రాజకీయ అంశాలపై అంతగా మాట్లాడింది కూడా లేదు. అలాంటిది ఉన్నట్టుండి ఫైర్ అయ్యారు. రాజీనామా చేద్దాం రండి.. అంటూ సవాల్ విసిరారు. ఆయన ఎందుకంత సీరియస్ అయ్యారు? పెద్దాయనకు ఆగ్రహం కలిగించేంత పరిణామాలు ఏం జరిగాయి? జిల్లాలో ఇదే చర్చ. ఆయనెవరో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. సవాళ్లతో వేడెక్కించిన స్పీకర్ పోచారం! పోచారం శ్రీనివాస్రెడ్డి. తెలంగాణ స్పీకర్. గతంలో మంత్రిగా పనిచేసిన… -
హుజురాబాద్లో పోటీపై కొండా సురేఖ క్లారిటీ.. ఆ హామీ ఇస్తేనే..!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది… టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగనుండగా.. ఇప్పటికే టీఆర్ఎస్ కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.. ఇక, కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటికే మాజీ మంత్రి కొండా సురేఖ పేరును ఖరారు చేశారని.. రేపోమాపో అధికారికంగా ఆమె… -
టిఆర్ఎస్లో త్వరలో పదవుల పండగ షూరు !
టీఆర్ఎస్ నేతలు మరియు కార్యకర్తలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ దిశా నిర్ధేశం చేసారు .ఇటు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ ఉంటుందని ప్రకటించారు కేటిఆర్ .గ్రేటర్ ఎన్నికల సమయంలో కో అపన్ష్ మెంబర్స్ గా అవకాశం ఇస్తామని హమీ ఇచ్చామని …అది కూడా జరిగేలా చూస్తామన్నారు.టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతూ… -
ఎల్లుండి మరో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు
ఈ నెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతం దగ్గరలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు… -
తెలంగాణ.. ఆ విషయంలో మరో ఘనత
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ఎన్నో ఘనతలను సాధిస్తూ ముందుకెళుతుంది. రోజురోజుకు పురోగతి సాధిస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతు భీమా, 24గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తాజాగా మరో ఘనతను తెలంగాణ తన ఖాతాలో వేసుకుంది. ఐటీరంగం పురోగతి, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీలో తెలంగాణ అమలు చేస్తున్న విధానాలు ఆదర్శంగా ఉన్నాయంటూ పార్లమెంటరీ ఐటీ… -
గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు !
గణేశ్ ఉత్సవాల నిర్వాహణపై తెలంగాణ హై కోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం పై ఆంక్షలు హైకోర్టు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తమ ఆంక్షలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్సాగర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని… హుస్సేన్సాగర్లో ట్యాంక్బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. హుస్సేన్సాగర్లో ప్రత్యేకంగా… -
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా… సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని అన్నారు. ఇక అటు రేవంత్ రెడ్డి కూడా ప్రజాకవి కి కాళోజీ నారాయణరావ్ కు నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం కాళోజీ సిద్ధాంతాలను అమలు చేయాలని.. కాళోజీ ఆశయాలను…
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
-
SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!