హీటెక్కుతున్న సంగారెడ్డి జడ్పీ రాజకీయాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంపకాల్లో తేడా వస్తే కోపాలొస్తాయి. ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నుతారు. ప్రస్తుతం ఆ జిల్లాలో ఇదే జరుగుతోందట. ప్రజాప్రతినిధులు, అధికారులు వైరివర్గాలుగా మారి ప్రతికార చర్యలకు దిగుతున్నారట. ఇప్పుడిదే రాజకీయాలను వేడెక్కిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఎప్పుడు ఎవరు ఎలా రివెంజ్ తీర్చుకుంటారో?
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్లో రాజకీయాలు ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చాయి. జడ్పీ కేంద్రంగా సాగుతున్న గొడవలు ముదురుపాకాన పడి ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు. జడ్పీ మీటింగ్లో అధికారులపై ప్రజాప్రతినిధులు ఫైర్ కావడంతో మొదలైన విభేదాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా రివెంజ్ తీర్చుకుంటారో అంతుచిక్కడం లేదట. పైగా ఒక వర్గానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి.. మరో వర్గానికి శాసనమండలి ప్రొటైం ఛైర్మన్ భూపాల్రెడ్డి కాపు కాయడంతో ఆధిపత్యపోరు మరింత ఆసక్తిగా మారిందట. దానిపైనే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
ఎవరి బండారం బయటపడుతుందో తెలియడం లేదా?
అధికారుల తీరువల్ల గ్రామాల్లో సర్పంచ్లపై వేటు పడుతోందని జడ్పీ మీటింగ్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఆ వివాదంలో అధికారులను జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ వెనకేసుకొచ్చారు. ఎవరు.. ఎంత తిన్నారో లెక్కలతో సహా అధికారుల పేర్లను బయటపెట్టడంతో వారు కంగుతిన్నారట. ఆ ఎపిసోడ్ తర్వాత ప్రజాప్రతినిధులపై ఆఫీసర్లు గుర్రుగా ఉన్నారట. ఇంతలో గ్రామ పంచాయతీ సభ్యులు కమీషన్ సొమ్ములు పంచుకుంటున్న వీడియో బయటకొచ్చింది. అధికారులే ఈ వీడియోను రిలీజ్ చేశారని ప్రజాప్రతినిధులు అనుమానిస్తున్నారట. పైగా ఇది ట్రైలరేనని.. ఇంకా చాలా వీడియోలున్నాయని.. అన్నీ బయటపెడతామని హెచ్చరిస్తున్నారట అధికారులు. దీంతో ఎవరి బండారం బయటపడుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారట ప్రజాప్రతినిధులు.
పటాన్చెరు ఆధిపత్యపోరుకు జడ్పీ వైరివర్గాలు తోడయ్యాయా?
పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఈ రగడలో ఎక్కువగా ఉండటంతో.. అక్కడి రాజకీయం రంజుగా మారుతోంది. సర్పంచ్లపై సస్పెన్షన్లను ఎత్తివేయిస్తూ ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆ వర్గానికి చేరువ అవుతున్నారు. జడ్పీటీసీలు, జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్లు ఎమ్మెల్యే శిబిరంలో ఉన్నట్టు చెబుతున్నారు. జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ, అధికారులు శాసనమండలి ప్రొటైం ఛైర్మన్ భూపాల్రెడ్డిని ఆశ్రయించినట్టు టాక్. వాస్తవానికి పటాన్చెరులో మహిపాల్రెడ్డి, భూపాలరెడ్డిల మధ్య ఆధిప్యత పోరు ఉంది. దానికి జడ్పీ వైరివర్గాలు కూడా తోడు కావడంతో సమస్య రాచపుండుగా మారుతోంది.
అవినీతిని పెద్ద ఘనకార్యంగా చూస్తున్నారా?
ఈ మొత్తం పొలిటికల్ ఎపిసోడ్లో సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఎవరికి వారు భావిస్తున్నారు. అధికారులపై ప్రజాప్రతిధులు.. ప్రజాప్రతినిధులపై అధికారులు ఆరోపణలు చేసుకుంటున్నారు. అవినీతి సొమ్ముల చుట్టూనే పంచాయితీ జరుగుతోంది. చేస్తోంది తప్పయినా.. ఎవరూ తప్పుగా అంగీకరించే పరిస్థితి లేదు. అదో పెద్ద ఘనకార్యంగా ప్రచారం చేసుకోవడం వారికే చెల్లింది. మరి.. పొలిటికల్ వీడియో గేమ్లో ఎవరు చిక్కుకుంటారో.. ఎవరు బయటపడతారో చూడాలి.
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!