తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే కరోనా కారణంగా ఈరోజు ఒక్కరు మృతి చెందారు. ఇదే సమయంలో 156 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73,469కి చేరింది. కరోనా నుంచి 6,65,755 మంది కోలుకోగా మొత్తం 3,973 మంది కరోనాతో…
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలపై టీఆర్ఎస్ కసరత్తు ఎంత వరకు వచ్చింది? పదవీకాలం ముగిసిన వారిలో ఓసీ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ. కొత్తగా సీటు ఆశిస్తున్నవాళ్లు.. రెన్యువల్ కోరుతున్న వారిలోనూ OC నేతలే అధికంగా ఉన్నారు. మరి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక లెక్కల సమతూకం ఎలా? ఈ అంశంపై గులాబీ శిబిరం తేల్చుకోలేకపోతోందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ఎలా? అధికార టీఆర్ఎస్లో పదవుల పండగ మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన…
రెండు పదవులు.. రెండు డజన్ల ఆశావహులు. పాలమూరు జిల్లాలో హీట్ రాజేశారు. ఆ ఇద్దరికే మళ్లీ ఛాన్స్ ఇస్తారా.. లేక కొత్తవారికి అవకాశాలు దక్కుతాయా? పార్టీ ఈక్వేషన్స్ చెబుతున్నదేంటి? ఇద్దరిలో ఒక్కరికి ఛాన్స్ ఇస్తారా? ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. గడిచిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ నుంచి కూచుకుళ్ల దామోదర్రెడ్డి గెలిచారు. కూచుకుళ్ల తర్వాతి కాలంలో టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఇద్దరూ నాగర్కర్నూల్…
సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు.. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఖాదర్ తో కలిసి కూతుర్ని హత్య చేసింది హీనా బేగం.. మద్యానికి బానిసై పిల్లలతో బెగ్గింగ్ చేయించారు.. ఢిల్లీ, ముంబై, జైపూర్ లో పిల్లలతో బెగ్గింగ్ చేశాయించారు ఖాదర్, హీన.. చిన్నారి బేబీ మెహక్.. నేను బెగ్గింగ్ చేయను అంటూ మారం చేసింది.. నేను నాన్న దగ్గరికి వెళ్తానంటూ గొడవ చేసింది..…
ధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర ప్రభుత్వం అలాగే… టీఆర్ఎస్ పార్టీల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే…. ఇందులో భాగంగానే.. అధికార టీఆర్ఎస్ పార్టీ నిన్న తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించింది. అయితే.. నిన్నటి ధర్నాలో టీఆర్ఎస్ కీలక నేతలు నోటికొచ్చింది మాట్లాడారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీని టార్గెట్ చేయగా…. రసమయి ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అయితే… ఈ ధర్నాలో టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ ఏకంగా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్…
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఎట్టకేలకు తన పంతాన్ని నెరవేర్చుకున్నారు. రెండు రోజుల కిందట ఆర్టీసీ ఎండీ సజ్జనార్… జారీ చేసిన నోటీసులపై తాజాగా రాపిడో సంస్థ దిగివచ్చింది. మొదట్లో తగ్గేదే లేదట్లు గా వ్యవహరించిన రాపిడో సంస్థ… మొత్తానికి… సజ్జనార్ దెబ్బకు ఓ మెట్టు దిగాల్సి వచ్చింది. తెలంగాణ ఆర్టీసీ సీటీ బస్సును ఉపయోగించుకుని యాడ్ లో చిత్రీ కరించిన సన్ని వేశాలను తొలగిస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది రాపిడో సంస్థ. ఈ…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ వైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై పార్టీ అధిష్టానం పోస్టుమార్టం చేస్తున్న సమయంలో.. ఆయన చేసిన కామెంట్లు పార్టీలో కలకలం రేపుతున్నాయి.. సమన్వయ లోపమే హుజురాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణంగా తేల్చిన ఆయన.. గతంలో పీసీపీ అధ్యక్షులుగా ఉన్న కె. కేశవరావు (కేకే), డి. శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ను మోసం చేశారని మండిపడ్డారు.. మరోవైపు…
ప్రతీ నెల రూ.500 కూడా దాటదు.. కానీ, ఉన్నట్టుండి ఆ ఇంటి నెలవారి కరెంట్ బిల్లు లక్ష దాటేస్తే.. ఆ ఇంటి యజమానికి షాక్ తగిలినంత పని కాకపోతే.. ఇంకా ఏమవుతుంది.. సాంకేతిక లోపమో.. రీడింగ్ నమోదు చేయడంలో పొరపాటుతోనే కానీ.. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తేనే ఉంటాయి.. చిన్న ఇంటికి ఏకంగా లక్షల్లో బిల్లులు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా.. ప్రతీనెల రూ. 400 దాటని ఇంటికి కరెంటు బిల్లు రూ.1.21…
ప్రభుత్వం.. పార్టీల మధ్య పోరాటం కాదు.. ఇది ప్రభుత్వాల మధ్య యుద్ధం.. రైతు పండించిన పంట కల్లాలు, మార్కెట్ యార్డ్లు, చివరకు రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తుంది.. కానీ, గిట్టుబాటు ధర చెల్లించి రైతు నుంచి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి… పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. మొత్తం వడ్ల చుట్టే తిరుగుతోంది రాజకీయం… వడ్ల పండించాలని ఒకరు, పండించవద్దని మరొకరు.. ఇలా రైతులను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని కేంద్రంలో…
కర్నూలు : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఏపీ పై అవాకులు, చవాకులు పేలడం మంచిది కాదని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్. బలవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని లాక్కున్నారు…. ఆర్ధికంగా బలంగా వున్నామని ఏపీ పై విమర్శలు మంచిది కాదని మండిపడ్డారు. శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే నిధులు మంజూరుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారన్నారు. మాజీ సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు…