Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..
- ఫిబ్రవరి 25న కారు అద్దెకు తీసుకున్న దుండగులు..
- తీసుకు వెళ్లిన వ్యక్తులపై నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
- పాత కారు నెంబర్ ప్లేటుతో పాటు ఫాస్టాగ్ మార్పు..
- రూ. 2.5 లక్షలకే కారు అమ్ముకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అద్దె కారు తీసుకున్నారు.. లాంగ్ డ్రైవ్కు వెళ్లారు.. మధ్యలో ఓ కన్నింగ్ ఐడియా వచ్చింది. అక్కడే కారు రూపు రేఖలు మార్చేశారు. తక్కువ ధరకు కారు విక్రయించేసి డబ్బులు తీసుకుని చెక్కేశారు. ఇక కారు యజమాని అడిగితే.. ట్రిప్లోనే ఉన్నామని బురిడీ కొట్టించిన బే’కార్’గాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అద్దెకు తీసుకున్న కారునే అమ్మేసుకున్నారు..
హైదరాబాద్లో కొంత మంది కేటుగాళ్లు.. జల్సాలకు అలవాటు పడి.. అద్దెకు తీసుకున్న కారునే అమ్మేసుకున్నారు. అలాంటి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో నల్లకుంట నివాసి రామలింగేశ్వర కారును ఫిబ్రవరి 25న కొంత మంది దుండగులు లాంగ్ డ్రైవ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. తర్వాత మిత్రులంతా కలిసి లాంగ్ డ్రైవ్ కోసం రాజస్థాన్ వెళ్లారు. అలా తీసుకు వెళ్లిన కారు.. చాలా రోజులైనా తిరిగి రాకపోవడంతో కారు యజమానికి డౌట్ కొట్టింది. దీంతో తీసుకు వెళ్లిన వ్యక్తులపై నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగు చూసింది.
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
Also Read:Sangareddy: బతుకుదెరువు కోసం వలస వచ్చిన భార్యాభర్తలు.. తెల్లవారుజామున దారుణం..
కారును రాజస్థాన్కు తీసుకు వెళ్లిన దుండగులు.. అక్కడే ఓ స్క్రాప్ దుకాణంలో ఉన్న మరో పాత కారు నెంబర్ ప్లేటుతో పాటు ఫాస్టాగ్ తీసి లాంగ్ డ్రైవ్కి తీసుకు వెళ్లిన కారుకు అమర్చారు. అంతే కాదు.. అంతా కరెక్ట్గా ఉందనుకున్న తర్వాత రాజస్థాన్లోనే కారును అమ్మేశారు. రూ. 2.5 లక్షలకే కారు అమ్ముకున్నారు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, బాబానగర్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మహీంద్రా XUV కారుతోపాటు 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!