వీడిన పంజాగుట్ట బాలిక మృతి కేసు మిస్టరీ.. అసలు విషయం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు.. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఖాదర్ తో కలిసి కూతుర్ని హత్య చేసింది హీనా బేగం.. మద్యానికి బానిసై పిల్లలతో బెగ్గింగ్ చేయించారు.. ఢిల్లీ, ముంబై, జైపూర్ లో పిల్లలతో బెగ్గింగ్ చేశాయించారు ఖాదర్, హీన.. చిన్నారి బేబీ మెహక్.. నేను బెగ్గింగ్ చేయను అంటూ మారం చేసింది.. నేను నాన్న దగ్గరికి వెళ్తానంటూ గొడవ చేసింది.. దీంతో ప్రియుడు ఖాదర్తో కలిసి కన్న కూతురినే హీన దారుణంగా కొట్టి హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు.. ఇక, చిన్నారి మృతదేహాన్ని బెంగళూరు నుండి బస్సులో తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి.. పంజాగుట్టలో వదలివెళ్లినట్టు తేల్చారు. దీంతో.. ఈ కేసు మిస్టరీని ఛేదించారు..
చిన్నారిపై మృతి కేసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్.. పూర్తి వివరాలను వెల్లడించారు.. బాలిక మృతికి కారణమైన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.. కన్న తల్లి, తన ప్రియుడితో కలిసి పాపను హత్య చేసినట్టు గుర్తించామన్న ఆయన.. రాజస్థాన్లోని అజ్మీర్ లో నిందితులైన తల్లి హీన బేగం, ప్రియుడు షేక్ మొహమ్మద్ ఖాదర్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.. ప్రియుడు ఖాదర్ ది డబీర్పురా, పాపా తల్లిది మియాపూర్ కాగా.. షేక్పేటలోని టెడ్డి కాంపౌండ్ వద్ద ఇద్దరికి పరిచయం ఏర్పడింది.. ఖాదర్ తో తన సమస్యలు చెప్పుకున్న హీనా బేగం చెప్పుకోవడం.. ఆయన ఓదర్చాడంతో.. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.. పిల్లలను తీసుకుని ఇద్దరు ముంబై, ఢిల్లీ, జైపూర్, మనాలి వెళ్లారు.. అక్కడ పిల్లల చేత భిక్షాటన చేయించారు.. అయితే, చిన్నారి బేబీ మెహక్ బెగ్గింగ్ చెయ్యడం ఇష్టం లేక పోవడంతో ప్రతిఘటించింది.. నాన్న దగ్గరికి వెళ్తానని గొడవ చేయడంతో చిన్నారిని దారుణంగా కొట్టి హత్య చేశారు.. చిన్నారిని బెంగళూరు నుండి హైదరాబాద్ తీసుకు వచ్చి పంజాగుట్ట ద్వారాకపురి కాలనిలో ఓ షాపు వద్ద వదిలి వెళ్లిపోయారు.. ఇక, ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ఛేదించడం కష్టంగా మారిందని.. అయినా ఛాలెంజ్కు తీసుకున్నామని తెలిపారు.. నిందితులు హైదరాబాద్ వస్తున్నారన్న సమాచారం మేరకు జూబ్లీ బస్టాప్ లో నిందితులను అరెస్ట్ చేశామని.. నిందితులు ఇద్దరిని రిమాండ్కు పంపుతామని తెలిపారు జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
తాజావార్తలు
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!