సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు.. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఖాదర్ తో కలిసి కూతుర్ని హత్య చేసింది హీనా బేగం.. మద్యానికి బానిసై పిల్లలతో బెగ్గింగ్ చేయించారు.. ఢిల్లీ, ముంబై, జైపూర్ లో పిల్లలతో బెగ్గింగ్ చేశాయించారు ఖాదర్, హీన.. చిన్నారి బేబీ మెహక్.. నేను బెగ్గింగ్ చేయను అంటూ మారం చేసింది.. నేను నాన్న దగ్గరికి వెళ్తానంటూ గొడవ చేసింది.. దీంతో ప్రియుడు ఖాదర్తో కలిసి కన్న కూతురినే హీన దారుణంగా కొట్టి హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు.. ఇక, చిన్నారి మృతదేహాన్ని బెంగళూరు నుండి బస్సులో తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి.. పంజాగుట్టలో వదలివెళ్లినట్టు తేల్చారు. దీంతో.. ఈ కేసు మిస్టరీని ఛేదించారు..
చిన్నారిపై మృతి కేసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్.. పూర్తి వివరాలను వెల్లడించారు.. బాలిక మృతికి కారణమైన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.. కన్న తల్లి, తన ప్రియుడితో కలిసి పాపను హత్య చేసినట్టు గుర్తించామన్న ఆయన.. రాజస్థాన్లోని అజ్మీర్ లో నిందితులైన తల్లి హీన బేగం, ప్రియుడు షేక్ మొహమ్మద్ ఖాదర్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.. ప్రియుడు ఖాదర్ ది డబీర్పురా, పాపా తల్లిది మియాపూర్ కాగా.. షేక్పేటలోని టెడ్డి కాంపౌండ్ వద్ద ఇద్దరికి పరిచయం ఏర్పడింది.. ఖాదర్ తో తన సమస్యలు చెప్పుకున్న హీనా బేగం చెప్పుకోవడం.. ఆయన ఓదర్చాడంతో.. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.. పిల్లలను తీసుకుని ఇద్దరు ముంబై, ఢిల్లీ, జైపూర్, మనాలి వెళ్లారు.. అక్కడ పిల్లల చేత భిక్షాటన చేయించారు.. అయితే, చిన్నారి బేబీ మెహక్ బెగ్గింగ్ చెయ్యడం ఇష్టం లేక పోవడంతో ప్రతిఘటించింది.. నాన్న దగ్గరికి వెళ్తానని గొడవ చేయడంతో చిన్నారిని దారుణంగా కొట్టి హత్య చేశారు.. చిన్నారిని బెంగళూరు నుండి హైదరాబాద్ తీసుకు వచ్చి పంజాగుట్ట ద్వారాకపురి కాలనిలో ఓ షాపు వద్ద వదిలి వెళ్లిపోయారు.. ఇక, ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ఛేదించడం కష్టంగా మారిందని.. అయినా ఛాలెంజ్కు తీసుకున్నామని తెలిపారు.. నిందితులు హైదరాబాద్ వస్తున్నారన్న సమాచారం మేరకు జూబ్లీ బస్టాప్ లో నిందితులను అరెస్ట్ చేశామని.. నిందితులు ఇద్దరిని రిమాండ్కు పంపుతామని తెలిపారు జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్.