రాష్ట్రంలోని కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించేందుకు పురపాలక శాఖ సిద్ధమైంది. గ్రామపంచాయతీల అనుమతితో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ మొదలు అన్ని మున్సిపాలిటీల్లో ఆకస్మిక తనిఖీలు చేసి కూల్చివేతలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. ఈ విషయంలో పక్కాగా ముందుకెళ్ళాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ అనుమతుల పేరిట హైదరాబాద్ శివార్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీ అనుమతి పేరుతో…
1) భారత్లో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు… ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్లో కొత్తగా 1,59,632 కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 327 మంది కరోనాతో మృతి చెందారు. అటు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 3,623కి చేరింది. 2) ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన షాక్తోనే ఈరోజు చంద్రబాబు కుప్పం చుట్టూ తిరుగుతున్నాడన్నారు.…
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు.. ప్రత్యర్థుల అవసరం లేకుండానే.. వారికివారే విమర్శలు, ఆరోపణలతో రచ్చకెక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై అధిష్టానికి కూడా ఫిర్యాదు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. అంతే కాదు.. పలు సందర్భాల్లో బహిరంగ విమర్శలు సైతం చేశారు.. అయితే, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవని వ్యాఖ్యానించారు.. ఇక, రాష్ట్రంలో ప్రజా…
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన పెద్ద రచ్చగా మారింది.. రైతుల ఆందోళనతో మార్గమధ్యలో ఇరుక్కుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయారు.. ఈ ఘటనలో పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి.. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని భద్రత పట్ట నిర్లక్ష్యంగా వ్యవహరించారని పంజాబ్లోని కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తోంది బీజేపీ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంజాబ్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేస్తుండగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా…
తెలంగాణలోని ఖమ్మంలో గత రెండు రోజులుగా ‘మిస్టర్ ఇండియా’ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మహారాష్ట్ర ఇంకమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్కు చెందిన సాగర్ కతుర్డె ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన ఆర్.కార్తికేశ్వర్, శర్వణన్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టీమ్ ఛాంపియన్ షిప్లో ఇండియన్ రైల్వేకు ప్రథమ స్థానం లభించగా తమిళనాడు జట్టుకు ద్వితీయ స్థానం లభించింది. విన్నర్గా నిలిచిన ఇండియన్ రైల్వేస్ టీమ్ 225 పాయింట్లు సాధించగా… రన్నరప్గా నిలిచిన తమిళనాడు…
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో శనివారం పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవల తనను కలసిన వారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. Read Also:…
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇకపై ప్రజలు తాము ఉన్న చోట నుంచే తమ సమస్యలను ప్రస్తావించి పరిష్కరించుకునే విధంగా ప్రజా బంధు పేరుతో నూతన యాప్ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజాబంధు యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలను ఇకపై నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. త్వరలో ఈ…
తరచూ రోడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కొన్ని ఘటనలు మినహాయిస్తే.. ఎక్కువ ప్రమాదాలు తాగి వాహనాలు నడపడమే కారణంగా తేలుతోంది.. మద్యం సేవించి.. వాహనాలతో రోడ్లపైకి వచ్చి.. మెరుపు వేగంతో దూసుకెళ్తూ.. ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నారు. అయితే, వాటికి చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. ఇప్పటి వరకు రాత్రి సమయంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేస్తూ.. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తూ, వాహనాలు సీజ్ చేస్తూ వస్తున్న పోలీసులు.. ఇక, ఓ సమయమంటూ లేకుండా…
సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బ్యాడ్న్యూస్ చెప్పింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని… ఈ నేపథ్యంలో ఆది, సోమవారాలలో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. Read Also: మందు బాటిల్ ముందేసుకుని…
★ నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం★ ఏపీ: కరోనా దృష్ట్యా నేడు మంగళగిరిలో జరగాల్సిన జనసేన కార్యవర్గ సమావేశం వాయిదా★ అమరావతి: నేడు జరగాల్సిన ఉద్యోగ జేఏసీ సమావేశం వాయిదా… తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేసిన ఉద్యోగ జేఏసీ★ హైదరాబాద్: ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవసర భేటీ★ నేడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం: వాతావరణశాఖ★ హైదరాబాద్: నేడు హీరో కృష్ణ…