బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం పర్యటన పెద్ద రచ్చగా మారింది.. అర్వింద్ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుని, దాడికి తెగబడ్డాయి.. బీజేపీ నేతలు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో అర్వింద్ కారుతోపాటు ఐదు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు బీజేపీ నేతలు, కార్య కర్తలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఫోన్ చేసి ఆరా తీశారు.. ఆర్మూర్లో టీఆర్ఎస్…
తెలంగాణలో బలపడేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. రాబోయే రెండేళ్ళు కష్టపడి పనిచేద్దాం అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ అనుబంధ మోర్చాల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్షించిన బండి సంజయ్ పలు సూచనలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’నిర్వహిస్తామన్నారు. వచ్చే నెలలో నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాల కల్పన కోసం ‘కోటి సంతకాల సేకరణ’చేపడతామన్నారు. జనం బీజేపీ పక్షాన ఉన్నారనే భయంతోనే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో అధికార పార్టీ నుండి దాడులు…
కేంద్రం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మా అవార్డుల్లో తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెర కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు భారీ సాయాన్ని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. హైదరాబాద్లోని నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు.. ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటిని ప్రకటించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య.. ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ను కలిశారు.. ఈ సందర్భంగా మొగిలయ్యను…
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా 1,01,812 శాంపిల్స్ పరీక్షించగా.. 3,877 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు కన్నుమూయగా.. ఇదే సమయంలో 2,981 మంది కోవిడ్ నుంచి పూర్థిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 7,54,976కు చేరగా.. రికవరీ కేసులు 7,10,479కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు మృతిచెందినవారి…
డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడ.. డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రం నుంచి తరిమేయాలని.. అది సామాజిక బాధ్యతతో ప్రతీ ఒక్కరు సహకారం అందించినప్పుడే సాధ్యం అవుతుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.. దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలన్నారు.. అదొక సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు…
మేడారంలో భక్తుల సందడి నెలకొంది. ముందస్తు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి వసతి సదుపాయం కల్పించారు. కరోనా వల్ల భక్తులు ముందుగానే వస్తున్నారు. జాతర రాకముందే బెల్లం బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. దర్శనం బాగా అయిందని భక్తులు చెబుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఉద్యోగుల బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా మొండి వైఖరి అవలంభిస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఈ నర్సంపేట వాసి ఉప్పుల…
డ్రగ్స్ వ్యవహారంపై మళ్లీ ఫోకస్ పెట్టారు తెలంగాణ పోలీసులు.. ఇవాళ డ్రగ్స్ పై డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి జంట నగరాల పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలు హాజరయ్యారు.. డ్రగ్స్ నియంత్రణకు 1000 మందితో ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు డీజీపీ.. ఇక, సీఎంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో హై లెవల్…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… చండ్రుగొండ మండలంలోని సుజాతనగర్కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డిపల్లి మండలానికి వరినారు తీసేందుకు బొలెరో వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. అయితే తిప్పనపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా బొగ్గు లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. Read…
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారాంతపు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అటు ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీసింది. పాఠశాలల పున:ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. Read Also: తెలంగాణలో భూములకు కొత్త మార్కెట్…