రాజన్నసిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేములవాడ రాజన్న ఆలయం వద్ద గుర్తు తెలియని దుండగులు శిశువును అపహరించారు. 28 రోజుల శిశువును అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ చెందిన లావణ్య వేములవాడ రాజన్న ఆలయం మెట్లమీద ఇద్దరు కుమారులతో కలిసి గత నాలుగు రోజులుగా ఒంటరిగా ఉంటుంది. కుటుంబ కలహాలతో లావణ్యను వదిలి వెల్లిపోయాడు భర్త. దీంతో అదే అలుసుగా భావించిన కొందరు దుండగులు ఈఘాతుకానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి…
మేసేజ్ ల కోసం వాట్సాప్ విస్తృతంగా వినియోగిస్తున్నందున HTP ఇటీవలే కొత్త చొరవను ప్రారంభించింది. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటి వరకు వాహన యజమాని మొబైల్ ఫోన్కు ఈ మెసేజ్లను ఎస్ఎంఎస్గా పంపుతున్నారు. ఇప్పుడు, రవాణా శాఖ నుండి పొందిన ఫోన్ నంబర్లు మరియు నివాస చిరునామాల డేటా పోలీసుల వద్ద అందుబాటులో ఉంది కాబట్టి, వాట్సాప్కు ఉన్న ప్రజాదరణను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయం. “వాహన యజమానులు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నివాస చిరునామా వివరాలు మరియు ఫోన్…
ప్రయాణికుల అవసరం.. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల అవకాశం.. వెరశి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొమురం భీం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు యాజమాన్యం మోసం బయటపడింది. పరిమితికి మించి ప్రయాణికులను బస్సు లో ఎక్కించడం తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వాంకిడి చెక్ పోస్ట్ వద్ద బస్సును రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి యూపీ, బీహార్ వెళ్లేందుకు ఒక ప్రైవేటుట్రావెల్స్ ద్వారా వెళుతున్న ప్రయాణికులు టికెట్ ధర…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ అకాల వర్షం రైతులను తీవ్ర నిరాశ పరిచింది. నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం…
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యొగుల పాలిట బంగారు హస్తం అయ్యింది. గత ఏడాది కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితుల ఎదురైన సంగతి తెలిసిందే..ఇప్పుడీప్పుడే రాష్ట్రం మళ్ళీ ఆర్థికంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే..ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రవేట్ సంస్థలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. ఇప్పటికే ప్రముఖ కంపెనీలలో ఉన్న పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది..కొన్ని పోస్టులకు సంబంధించిన ఉద్యొగాలు భర్థీ అయ్యాయి. ఇప్పుడు మరో నోటిఫికేషన్…
https://www.youtube.com/watch?v=eOAEUkF05dc సోమవారం ఏ రాశివారు ఏం చేయాలి? ఏ కార్యక్రమాలు చేస్తే ఫలితాలు ఎలా వుంటాయి. ద్వాదశ రాశులకు సంబంధించి గ్రహచారం, మంచీచెడు గురించి శ్రీరాయప్రోలు మల్లిఖార్జున శర్మ రాశిఫలాలు అందిస్తారు. ఆ రాశిఫలాలు ఎలా వున్నాయో ఈ వీడియోలో చూద్దాం.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపల్ ఆఫీస్ లో హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. బిజెపి అంటే భారతీయ జూటా పార్టీ అని విమర్శించారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలపై స్థానిక బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే తాను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. అమిత్ షా కాదు అబద్ధాల బాద్ షా అని…
కిచెన్లో ఉల్లిపాయలు, టమోటా లేకుంటే రోజు గడవదు. ఉల్లిపాయలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. కిలో 20 రూపాయల లోపే లభిస్తున్నాయి. ఇక నిత్యం కూరల్లో వాడే టమోటా ధర మాత్రం ఆకాశానికి చేరింది. అక్కడినించి దిగనంటోంది. తిరుపతిలో మరింతగా పెరిగింది టమోటా ధర. మదనపల్లె మార్కెట్లో రూ.70కి చేరింది కేజీ టమోటా ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు టమోటాల వినియోగం ఎక్కువగా వుంటుంది.…
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం మూల మాస్త్ర హావనములు, పూర్ణాహుతి, సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించి, సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావంతో జయంతి ఉత్సవాలు ముగుస్తాయి. రేపటి నుండి సుదర్శన నరసింహ హోమం, నిత్యా, శాశ్వత కళ్యాణం, నిత్యా, శాశ్వత బ్రహ్మోత్సవం పునఃప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. కాగా.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో రెండు రోజులుగా కన్నుల పండువగా జయంత్యుత్సవాలు…