Dr. Laxman: భక్తులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టదా?
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై హైదరాబాద్కు వచ్చిన లక్ష్మణ్కు బీజేపీ రాష్ట్ర శాఖ ఘనస్వాగతం పలికింది. అనంతరం నాంపల్లిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లక్ష్మణ్ మాట్లాడారు. యాదాద్రిలో సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. సరైన సదుపాయాలు కల్పించకుండానే దేవాలయ దర్శనాలకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దేవాలయ నిర్మాణంలో మొదట నుండి ఉన్న చిన్న జీయర్ స్వామి వారిని విస్మరించారని, గవర్నర్ ను గౌరవించడం మర్చిపోయారని డా.లక్ష్మణ్ నిప్పులు చెరిగారు.
తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందనేందుకు తన ఎన్నికే నిదర్శనమన్నారు. యూపీ అభివృద్ధిపై గతంలో మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారని, తనతో పాటు వస్తే ప్రగతిని చూపిస్తానని చెప్పారు. మోదీజీ నేతృత్వంలో నేత్రుత్వంలో కేసీఆర్ పాలనను పెకిలించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలోనూ మరో 20 ఏళ్లపాటు మోదీ ప్రభుత్వం కొనసాగనుంది. కేటీఆర్..! తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 2.52 లక్షలు కోట్లు ఇచ్చింది. ఆధారాలతోసహా వివరిస్తా.. రాజీనామా చేయడానికి సిద్దంగా ఉండాలని సవాల్ విసురుతున్నాం.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
శ్రీలంకలో ఏ విధంగా అవినీతి, కుటుంబ పాలన కొనసాగడం వల్ల ఆ దేశ ప్రజలు బిచ్చమడిగే పరిస్థితి నెలకొందో…. కేసీఆర్ కుటుంబ అవినీతి-నియంత పాలనవల్ల తెలంగాణ రాష్ట్రం అప్పులపాలై ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితి నెలకొంది. తెలంగాణలో పేదల బతుకులు బాగుపడాలంటే.. అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యం. అందుకోసం బీజేపీ కార్యకర్తలంతా ఇష్టపడి, కష్టపడి పనిచేయండి. పార్టీ కోసం సమయం వెచ్చించండి. టీఆర్ఎస్ పునాదులు బద్దలు కొడదాం.. గొల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా పనిచేద్దాం మని పిలుపు నిచ్చారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!