Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Etela Rajender Challenges Cm Kcr Harish Rao

Etela Rajender: చర్చకు సిద్ధమా.. కేసీఆర్‌కు సవాల్

Published Date :June 5, 2022 , 4:52 pm
By NTV WebDesk
Etela Rajender: చర్చకు సిద్ధమా.. కేసీఆర్‌కు సవాల్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం vs బీజేపీ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే! కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. అసలు కేంద్రం రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు వారి వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. డప్పు కొట్టుకోవడం తప్పిస్తే, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని టీఆర్ఎస్ తిప్పికొడుతోంది. కానీ, బీజేపీ నేతలు మాత్రం కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చిందని ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈ విషయంపై తాము చర్చకు సిద్ధమేనంటూ సవాళ్లు విసురుతున్నారు.

తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సరిగ్గా అలాంటి ఛాలెంజే చేశారు. కేంద్రం ఇచ్చే నిధులపై సీఎం కేసీఆర్‌తో అయినా, ఆర్థికమంత్రి హరీశ్ రావుతో అయినా చర్చకు సిద్ధమని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం వెలవెలబోతోందని.. అందులో పాల్గొనేందుకు అధికారులు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. సీఎం కెసిఆర్ చెప్పే మాటలు అన్నీ పచ్చి అబద్ధాలు అని మరో సారి నిరూపించబడిందని తెలిపారు. సర్పంచులకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులే తప్ప.. మిగతా నిధులు రావడం లేదని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులతో మాత్రమే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్రం నిధులు వాడుకుంటూ.. మొత్తం తామే చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం డప్పు కొట్టుకుంటోందని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తానని మాటిచ్చిన కేసీఆర్, ఆ మాట తప్పారని ఈటెల అన్నారు.

Also Read

  • Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
  • CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
  • Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
  • Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
Add as a preferred
source on google

వీఆర్వోల పరిస్థితి దారుణంగా ఈటెల ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఎవరినీ కలవరు, ఎవరు చెప్పినా వినరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే, పల్లెలు వల్లకాటుగా మారే ప్రమాదం ఉందనన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే సీఎం కేసీఆర్.. నిధులు ఇవ్వడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. 3 లక్షల వరకు తీసుకొనే రుణాలకి గాను మహిళ సంఘాలకు కేంద్ర ప్రభుత్వమే 7%వడ్డీ చెల్లించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలు ఎదిగేందుకు అనేక పథకాలు ప్రవేశపెడితే, రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఉసురు తీస్తోందని మండిపడ్డారు. అభయ హస్తం స్కీమ్‌తో పెన్షన్, ఇన్సూరెన్స్, స్కూల్‌కి వెళ్లే పిల్లలకు న్యాయం జరుగుతుందని, కానీ ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని విమర్శించారు. మహిళల కళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వం మట్టి కొట్టిందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో గొప్పగా ప్రారంభించిన బంగారుతల్లి పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందని, రానున్న రోజుల్లో మహిళలు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు. మహిళలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంకెల కోసం మాత్రమే మొన్నటి బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఈమధ్య ప్రవేశ పెట్టిన బడ్జె‌ట్‌లో 70 వేల కోట్లు అంకెల గారడి మాత్రమేనన్నారు. మద్యపానం ద్వారా 40వేల కోట్లు గుంజుతున్నారన్నారు. ఒక్కో జిల్లాకు ఒక్కో రోజు జీతాలు ఇస్తున్న మాట వాస్తవమా? కాదా? అని ప్రశ్నించిన ఈటెల రాజేందర్.. గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆర్థిక విషయాలపై ఆర్టీఐ ధ్వారా సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Etela Rajender
  • harish rao
  • telangana
  • Telangana Politics

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions