రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పెద్దఅంబర్ పేట్ లో ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. కండర్ షైర్ స్కూల్ కు చెందిన బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో.. స్కూల్ సెక్యూరిటీ గార్డుపైకి బస్సు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులంతా స్కూల్ లోపలికి వెళ్లిపోవడంతో.. పెనుప్రమాదం తప్పినట్లయింది. కాగా.. ప్రమాదంలో సెక్యూరిటీ గార్డుకు తీవ్రగాయాలవ్వడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బస్సు ప్రమాదం గురించి ప్రశ్నించిన…
జిల్లాలో ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడుతున్నాయి. సుముహూర్తాలకు ఇక కొద్ది రోజులే గడువు ఉండటంతో శుభకార్యానికి ఆలస్యమెందుకు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో.. బంగారు, వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇక శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు…అంటున్నారు పురోహితులు. అవును మరి…వచ్చేనెల (జూన్) దాటితే తిరిగి డిసెంబరు వరకు వేచి చూడాల్సిందే. లేదా వచ్చే సంవత్సరమే. ఈ ముహూర్తాలు దాటితే ఐదు నెలలపాటు ముహూర్తాలు ఉండవట. అందుకే తల్లిదండ్రులు హడావుడి…
గత రెండేళ్లు కరోనా కారణంగా స్కూల్స్ మూత పడ్డాయి..ఆన్ లైన్ క్లాసులు ఉన్న కూడా వాటి ద్వారా విద్యార్థులకు పెద్దగా అవగాహన కలగలేదు.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్కూల్స్, కాలెజిలు కొనసాగిన కూడా పిల్లలకు సరిగ్గా సబ్జెక్ట్ లు అర్థం చేసుకోలేక పోయారు. వెంటనే పరీక్షలు కూడా మొదలు అయ్యాయి.కనీసం పాస్ మార్కు లైన రావాలంటే ఏయే అంశాలపై దృష్టి సాధించాలి మరియు 60 శాతం మార్కులు రావాలంటే ఏం చేయాలి ? ఎలా సిలబస్ ను…
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేటి నుంచి పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించమే లక్ష్యంగా పర్యటన వెళ్తున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్తో పాటు స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరి వెళ్తారు. లండన్లో మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీకానున్నారు. ఆ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు…
* ఐపీఎల్లో నేడు ముంబైతో తలపడనున్న హైదరాబాద్, ముంబై వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం.. * హైదరాబాద్లో నేటి బంగారం ధరలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250, * నేడు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన, ఓర్వకల్ మండలం గుమ్మటం తాండా వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ను పరిశీలించనున్న సీఎం. * మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు, ఢిల్లీ…
కాకినాడలో అదృశ్యమైన ఓ బాలిక సికింద్రాబాద్లో శవమై కనిపించింది.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం కాగా.. చికిత్స పొందుతూప్రాణలు వదిలింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ ఎల్లంగిరి ప్రాంతనికి చెందిన మైనర్ బాలిక.. తెనాలికి చెందిన హరికృష్ణతో చనువుగా ఉండేది.. రెండు వారాల క్రితం ఇద్దరు.. ఇళ్లు వదిలి సికింద్రాబాద్ చేరుకోగా.. మారేడుపల్లిలో అపస్మారక స్థితిలో ఉన్న వీరిద్దరిని.. స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు..…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… అమిత్షా హోంమంత్రి లెక్క మాట్లాడలేదు.. చౌకబారు నేత లెక్క మాట్లాడారంటూ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ దోపిడీ చేస్తే… హోం మంత్రిగా అమిత్ షా బాధ్యత మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు కేసీఆర్ అవినీతికి కంచే వేసి కాపాడుతుంది అమిత్ షానే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించిన…
తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది.. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత వరుస కార్యక్రమాలు చేపడుతోంది.. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రైతు డిక్లరేషన్ణు జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది.. అందులో భాగంగా.. మే 21 నుండి జూన్ 21 వరకు రైతు రచ్చ బండ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ప్రతి పోలింగ్ బూత్లో కరపత్రాలు, ఫ్లెక్సీలు పెడతాం.. రైతు డిక్లరేషన్ పై అవగాహన కల్పిస్తాం అన్నారు.…
భారత దేశ రైతాంగానికి శుభవార్త.. ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. భారత్లోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.., అండమాన్ను తాకాయి నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో మరింత చురుకుగా కదులుతోన్న నైరుతి రుతుపవనాలు.. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరించినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది ఐఎండీ. Read Also: Bandi Sanjay: నాగరాజు కుటుంబానికి పరామర్శ.. హత్య వెనుక పెద్ద కుట్ర..! ఇక, నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో…
హైదరాబాద్లోని సరూర్నగర్లో దారుణ హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. సీఎం కేసీఆర్ మానవత్వం లేని మూర్ఖుడు.. నాగరాజును కిరాతకంగా చంపేసినా స్పందించక పోవడం దారుణం అన్నారు. బాధిత కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం తోపాటు 8.5 లక్షలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశించినా.. ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్న…