Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram: సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSAM) ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా (Meta)కు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పిల్లల ఆన్లైన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) మెటాను వివరణ కోరేందుకు సిద్ధమైంది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ను ప్రోత్సహించే ప్రకటనలు ఇన్స్టాగ్రామ్లో ఎలా కనిపించాయనే అంశంపై ప్రభుత్వం సమాధానాలు కోరనుంది.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
అనుచిత ప్రకటనలు ఎందుకు అనుమతించబడ్డాయి.? అవి ఎలా ప్లాట్ఫామ్లోకి వచ్చాయి.? వాటిని అడ్డుకునేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి భద్రతా చర్యలు చేపడతారనే అంశాలపై మెటాను ప్రశ్నించనున్నారు. అయితే ఈ అంశంపై మెటా నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని మీడియా నివేదికలు, దర్యాప్తు కథనాల ప్రకారం చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ను ప్రచారం చేసే కొన్ని చెల్లింపు ప్రకటనలు ఇన్స్టాగ్రామ్లో ప్రదర్శితమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రకటనల ద్వారా వినియోగదారులను టెలిగ్రామ్ ఛానెల్లకు మళ్లించి, అక్కడ అక్రమ కంటెంట్ను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంలో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి ప్రకటనలు ఇన్స్టాగ్రామ్ ప్రకటనల ఆమోద ప్రక్రియను దాటుకుని వినియోగదారుల ముందుకు రావడమే. దీంతో సోషల్ మీడియా సంస్థల బాధ్యత, కంటెంట్ పర్యవేక్షణ వ్యవస్థల పనితీరుపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. పిల్లల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికలు తమ ప్లాట్ఫామ్లలో చట్టవిరుద్ధమైన కంటెంట్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై మెటా ఇచ్చే వివరణ, తదుపరి చర్యలు ఇప్పుడు కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్తో డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!