TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- మమతా బెనర్జీకి మరో షాక్..
- కోల్కతాలో పార్టీ కార్యాలయానికి తాళం వేసిన రీటబ్రత వర్గం..
- తమదే అసలైన టీఎంసీ అంటూ నేతల నినాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC: మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సంక్షోభం మరింత తీవ్రమైంది. టీఎంసీకి చెందిన రీటబ్రత వర్గం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆక్రమించుకుంది. రీటబ్రత బెనర్జీ కార్యాలయానికి తాళం వేసి, తాళాలు తీసుకెళ్లారు. తమదే నిజమైన టీఎంసీ అని ఆ వర్గం నేతలు ప్రకటించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మెట్రోపాలిటన్ ఈఎం బైపాస్లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి సమావేశం నిర్వహించారు. రీటబ్రత వర్గం నేతలు తమదే నిజమైన టీఎంసీ అంటూ పార్టీ కార్యాలయం ముందు పోస్టర్లు అంటించారు.
శుక్రవారం రీటబ్రత బెనర్జీ, ఫిర్హాద్ హకీం, సందీపన్ సాహా, జావేద్ ఖాన్, అఖ్రుజ్జమాన్, పలువురు ఇతర నాయకులు మెట్రోపాలిటన్ ఈఎం బైపాస్లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. పార్టీ ప్రధాన ద్వారా వద్ద మమతా బెనర్జీ, అరూప్ రాయ్ల చిత్రాలతో కూడా ఒక పోస్టర్ కూడా ఏర్పాటు చేశారు. రీటబ్రత వర్గం ఇటీవల మమతను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, అరూప్ రాయ్ను కొత్త అధ్యక్షుడిగా నియమించుకుంది. ఈ వర్గం మమతా బెనర్జీని తమ సలహాదారుగా పేర్కొంటోంది. సమావేశం తర్వాత పార్టీ కార్యాలయ తాళాలను రీటబ్రత వర్గం తమ వెంట తీసుకెళ్లారు.
Also Read
- Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
- US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
ఈ పరిణామాలపై మమత వర్గం తీవ్రంగా స్పందించింది. తిరుగుబాటు నేతలకు పార్టీ కార్యాలయంతో ఎలాంటి సంబంధం లేదని, వారి వాదనలకు చట్టబద్ధత లేదని ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. వారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపిస్తూ, చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని స్పష్టం చేశారు. పార్టీ నుంచి బహిష్కరించబడిన వ్యక్తులకు ఎన్నికల సంఘం ఎలా అపాయింట్మెంట్ ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, అసలైన టీఎంసీ ఎవరిదనే వాదనల నేపథ్యంంలో ఎన్నికల సంఘం ఇరు వర్గాలను జూలై 6 సాయంత్రం లోగా పత్రాలను, వాదనల్ని సమర్పించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్కు కాదు, రేవంత్కే నా సపోర్ట్
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!