TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- మమతా బెనర్జీకి మరో షాక్..
- కోల్కతాలో పార్టీ కార్యాలయానికి తాళం వేసిన రీటబ్రత వర్గం..
- తమదే అసలైన టీఎంసీ అంటూ నేతల నినాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC: మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సంక్షోభం మరింత తీవ్రమైంది. టీఎంసీకి చెందిన రీటబ్రత వర్గం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆక్రమించుకుంది. రీటబ్రత బెనర్జీ కార్యాలయానికి తాళం వేసి, తాళాలు తీసుకెళ్లారు. తమదే నిజమైన టీఎంసీ అని ఆ వర్గం నేతలు ప్రకటించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మెట్రోపాలిటన్ ఈఎం బైపాస్లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి సమావేశం నిర్వహించారు. రీటబ్రత వర్గం నేతలు తమదే నిజమైన టీఎంసీ అంటూ పార్టీ కార్యాలయం ముందు పోస్టర్లు అంటించారు.
శుక్రవారం రీటబ్రత బెనర్జీ, ఫిర్హాద్ హకీం, సందీపన్ సాహా, జావేద్ ఖాన్, అఖ్రుజ్జమాన్, పలువురు ఇతర నాయకులు మెట్రోపాలిటన్ ఈఎం బైపాస్లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. పార్టీ ప్రధాన ద్వారా వద్ద మమతా బెనర్జీ, అరూప్ రాయ్ల చిత్రాలతో కూడా ఒక పోస్టర్ కూడా ఏర్పాటు చేశారు. రీటబ్రత వర్గం ఇటీవల మమతను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, అరూప్ రాయ్ను కొత్త అధ్యక్షుడిగా నియమించుకుంది. ఈ వర్గం మమతా బెనర్జీని తమ సలహాదారుగా పేర్కొంటోంది. సమావేశం తర్వాత పార్టీ కార్యాలయ తాళాలను రీటబ్రత వర్గం తమ వెంట తీసుకెళ్లారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ఈ పరిణామాలపై మమత వర్గం తీవ్రంగా స్పందించింది. తిరుగుబాటు నేతలకు పార్టీ కార్యాలయంతో ఎలాంటి సంబంధం లేదని, వారి వాదనలకు చట్టబద్ధత లేదని ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. వారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపిస్తూ, చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని స్పష్టం చేశారు. పార్టీ నుంచి బహిష్కరించబడిన వ్యక్తులకు ఎన్నికల సంఘం ఎలా అపాయింట్మెంట్ ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, అసలైన టీఎంసీ ఎవరిదనే వాదనల నేపథ్యంంలో ఎన్నికల సంఘం ఇరు వర్గాలను జూలై 6 సాయంత్రం లోగా పత్రాలను, వాదనల్ని సమర్పించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?