KTR : హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించారు. ఈ ఫిల్మ్ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ప్రముఖ బీఆర్ఎస్ నేతలు హాజరై ఫిల్మ్ను తిలకించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గాంధీభవన్ వెలవెలబోతుండగా, తెలంగాణ భవన్ రోజూ సందడిగా ఉండటం విశేషమని తెలిపారు. వచ్చే ఏప్రిల్తో బీఆర్ఎస్…
TPCC Mahesh Goud : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరి ఆనందానికి కారణమవుతోందని పేర్కొన్నారు. “ప్రజలు సంతోషంగా ఉన్నందునే ప్రభుత్వం పండగ నిర్వహిస్తోంది. ఈ ప్రజాపాలన పండగలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు. మహేష్ గౌడ్ ప్రకటన ప్రకారం, గత పదేళ్లలో బీఆర్ఎస్ కేవలం 50 వేల ఉద్యోగాలను అందించగలిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క…
Bhatti Vikramarka : అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా నాలుగు నెలల కోసం వోట్ ఒన్ అకౌంట్ బడ్జెట్ పెట్టామని, 3లక్షల 69 వేల 286 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2 లక్షల 86 వేల పెన్షనర్లకు నెల మొదటి రోజే జీతాలు చెల్లిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉద్యోగుల ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు నెలనెలా జీతాలు చెల్లిస్తున్నామని, నాడు బీఆర్ఎస్ ఉద్యోగ…
తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నగరంలో అభివృద్ధి అంశంపై కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులనే ప్రస్తావిస్తూ, గత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరంలో ట్యాంక్ బండ్, శిల్పారామం, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి పట్ల పలు విమర్శలు వ్యక్తం చేస్తూ, సిటీలో కనీస డ్రైనేజీ వ్యవస్థ కూడా పూరణ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. HYDRA :…
NVSS Prabhakar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంబరాలు ఎవరి కోసం చేస్తున్నారని వారికే అర్థం కావడం లేదని, సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన కొద్దీ గంటలకే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. దేశంలోనే వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకు వేయలేదని, రాజకీయంగా మాదిగలను…
MLA Sticker : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి ఎమ్మెల్యే గా మేడిపల్లి సత్యం, గెలిచి నేటితో సంవత్సరం గడుస్తున్నా.. ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం తీయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గురుకుల బాట కార్యక్రమంలో, ఎమ్మెల్యే స్టిక్కర్ కెమెరాకు చిక్కింది.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పోయి ఏడాది గడిచింది.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్…
Aadi Srinivas : హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వర రావు ఇప్పుడు కూలేశ్వర రావు గా మారిపోయారని, హరీష్ రావు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా? అని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి వస్తానని అడిగింది వాస్తవం కాదా? హరీష్ ప్రయత్నాలు కేసీఆర్ కి తెలిసి దూరం పెట్టలేదా? అని ఆయన…
Bandi Sanjay : జేఎన్జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును గౌరవించాచాల్సిందే. అయితే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కకపోవడానికి పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే ప్రధాన కారణం. 17 ఏళ్ల క్రితం పుస్తెలు తాకట్టు పెట్టి, అప్పు చేసి ఒక్కో జర్నలిస్టు…
స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టెండర్లు.. నిబంధనల మేరకు నిర్వహిస్తారని, ఎవరు టెండర్లలో రాణిస్తే వాళ్లకు ఇస్తారన్నారు.