Minister Seethakka: నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా
- గ్రామీణ అభివృద్ధి, పల్లెల్లో పారిశుధ్యం, ప్రజల సంక్షేమంపై కీలకమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి.
- కోయ జాతికి చెందిన నేను కాంగ్రెస్ ఇచ్చిన అవకాశంతో మంత్రి పదవి చేపట్టానన్న సీతక్క.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి, పల్లెల్లో పారిశుధ్యం, ప్రజల సంక్షేమంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన దేశం గ్రామాలతో ముడిపడిందని, అందుకే గ్రామాలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డిపిఓలదే అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతికి స్థానిక పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉందని మంత్రి సూచించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు లేకపోయినా, ఒత్తిడి తట్టుకుని పనిచేసిన డిపిఓలను అభినందించారు. గ్రామీణ ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకే దక్కిందని, అందుకే ఈ ఉద్యోగాన్ని కేవలం పనిగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని ఆమె తెలిపారు.
Also Read: OYO: పెళ్లికాని జంటలకు ఓయో బిగ్ షాక్.. కొత్త రూల్స్తో వారికి చెక్
Also Read
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
అధికారులు సిబ్బందితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ, పనుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. సిబ్బందితో ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించి, పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. నా శాఖను నేను నా కుటుంబంగా భావిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖ మన అందరిదీ. మీరూ దీన్ని కుటుంబంగా భావించి పని చేయండని మంత్రి సీతక్క అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు సఫాయి కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్ల పాత్ర ఎంతో ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో వీరి సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో, ఇకపై ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీ ద్వారా కాకుండా కమిషనర్ కార్యాలయం నుంచే జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
Also Read: K Laxman: కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం.. బీజేపీ ఎంపీ ఫైర్
వేసవిలో తాగునీటి సమస్యల నివారణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. మనం సరఫరా చేసే తాగు నీటిపై ప్రజల్లో నమ్మకం కల్పించడమే లక్ష్యమని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కోయ జాతికి చెందిన నేను కాంగ్రెస్ ఇచ్చిన అవకాశంతో మంత్రి పదవి చేపట్టానని సీతక్క గుర్తుచేశారు. కింది వర్గాల సామర్థ్యంపై ఉన్న దురాభిప్రాయాలను తమ పనితీరుతో తప్పనిసరిగా నిరూపించాలని మంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
-
Kantamaneni Ravi Shankar: పంచభూతాలపై టాలీవుడ్ లో కొత్త సినిమా
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!