Addanki Dayakar: రైతు భరోసాపై విమర్శలు చేసే వారికి అద్దంకి దయాకర్ కౌంటర్
- రైతు భరోసాపై విమర్శలపై స్పందించిన అద్దంకి దయాకర్
- హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శలకు తప్ప దేనికీ పనికిరారన్న దయాకర్.
- కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Addanki Dayakar: తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వస్తున్న విమర్శలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శలకు తప్ప దేనికీ పనికిరారని ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో రైతులు ఎన్నో గడ్డు రోజులు ఎదుర్కొన్నారని అన్నారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు ఋణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కిందని దయాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఎంత కట్టుబడి ఉన్నారో ఈ చర్యలు ప్రూవ్ చేశాయని అన్నారు. అన్ని పంటలకు బోనస్, రైతు భీమా, నష్టపరిహారం అందించడమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని ఆయన అన్నారు.
Also Read: CM Revanth Reddy: ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం
Also Read
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
బీఆర్ఎస్, బీజేపీలకు రైతుల సంక్షేమం గురించి పట్టించుకునే ఆలోచన లేకుండా, వారు రైతులను దోచుకున్న చరిత్ర మాత్రమే ఉందని దయాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పేరుతో చెట్లకు, పుట్టలకు, ఫిల్మ్ సిటీలకు 20 వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ధనాన్ని దోచుకున్న దొంగలు ఒకవైపు, రాష్ట్రానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వ దొంగలు మరోవైపు మాట్లాడుతున్నారని దయాకర్ అన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నామని అన్నారు. రైతులు సంతోషంగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై అనవసర విమర్శలు చేసే ప్రతి పక్షాలను ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అద్దంకి దయాకర్ ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!