Mallu Bhatti Vikramarka: వరంగల్ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
- నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం.
- మొగిలిచెర్లలో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న భట్టి.
- విద్యుత్ సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలపై సమీక్షలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు (ఆదివారం) వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్లో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి మొగిలిచెర్లలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా.. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 1.45 గంటలకు హనుమకొండకు చేరుకుంటారు. అనంతరం 1.55 గంటల నుంచి 2.45 గంటల వరకు సుప్రభ హోటల్లో బస చేసి అక్కడి నుంచి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)కు వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 3.30 గంటల వరకు ఐడీఓసీ లో అధికారులతో సమావేశమై, సబ్స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను చర్చిస్తారు.
Also Read: Daaku Maharaj : డాకూ మహారాజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం.. భారీగా తరలి వచ్చిన అభిమానులు
Also Read
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ఆ తర్వాత మొగిలిచెర్లకు వెళ్లి గీసుకొండ మండలంలోని విశ్వనాథపురం, మొగిలిచెర్ల, గొర్రెకుంట ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు శిలాఫలకాన్ని ప్రతిష్టిస్తారు. ఆపై సాయంత్రం 4.30 గంటలకు మొగిలిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో విద్యుత్ సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. మొత్తానికి నేడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు వరంగల్ జిల్లాలో బిజీబిజీగా గడపబోతున్నారు.
తాజావార్తలు
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!