DK Aruna: రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం
- బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం.
- జలను మోసం చేసి ఓట్లు దండుకున్న సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్.
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్కు జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న ఎంపీ డీకే అరుణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్కు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాజెక్టు తీసుకురావడంలో తన పాత్రను గుర్తు చేస్తూ అరుణ మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును తెచ్చింది నేనే.. మా నాన్న పాలమూరు కోసం అనేక పోరాటాలు చేశారు, మా కుటుంబం జిల్లా కోసం ప్రాణాలు అర్పించిందని తెలిపారు. వారిని గుర్తుచేసే అవసరం రేవంత్ రెడ్డికి లేదా అంటూ ప్రశ్నించారు.
Also Read: Addanki Dayakar: రైతు భరోసాపై విమర్శలు చేసే వారికి అద్దంకి దయాకర్ కౌంటర్
Also Read
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
- Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
- CM Vijay: సింహాసనం విజయ్ది.. వ్యూహం కాంగ్రెస్ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
జైపాల్ రెడ్డి పేరు ప్రాజెక్ట్కు పెట్టడం రేవంత్ రెడ్డి బంధు ప్రేమకు నిదర్శనమని డీకే అరుణ ఆరోపించారు. జైపాల్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? జూరాల ప్రాజెక్టుకు శాంక్షన్ చేయించింది సమరసింహ రెడ్డి అని, భీమా ప్రాజెక్ట్ కోసం మా నాన్న పోరాడారని ఆమె మాట్లాడారు. కావాలంటే మెట్రో ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టండి. కానీ, ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు తగదని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు.
అలాగే డీకే అరుణ రైతు సంక్షేమంపై కూడా ప్రభుత్వం చర్యలను విమర్శించారు. రైతు భరోసా కింద 15 వేలు ఇవ్వాల్సిందేనని, బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితి ఎన్నికల ముందు తెలియదా? గెలవడం కోసం అబద్ధాలు చెప్పావా? అని ముఖ్యమంత్రిని నిలదీశారు.
Also Read: CM Revanth Reddy: ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం
తాను బీజేపీ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తానని డీకే అరుణ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కాకుండా, పార్టీ నిర్ణయాలను గౌరవిస్తానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం అని ఆవిడ అన్నారు. అలాగే ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్న సీఎం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. రైతులు, ప్రజల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి గుర్తు చేశారు.
తాజావార్తలు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
-
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
-
K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
-
OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?