CM Revanth Reddy: ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం
- "అభయ హస్తం" పేరిట చెక్కులు పంపిణీ చేసిన సీఎం..
- ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం
- పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకు ప్రకటించిన విధంగా సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ “అభయ హస్తం” పేరిట చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్ శాంతికుమారి, మరికొందరు ప్రజాప్రతినిధులు సైతం హాజరయ్యారు.
Also Read: Nara Lokesh: నా ఉద్యోగం తీయించేలా ఉన్నావే.. విద్యార్థితో లోకేశ్ ఛలోక్తి!
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ఇక ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొన్ని కీలక నిర్ణయాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏడాదిలో 55,143 ఉద్యోగాలు అందించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చామని, దేశంలో ఎవరూ ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు 14 ఏళ్ల తర్వాత మేమే చేపట్టామని.. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వీటి కోసం పెద్దగా ప్రయత్నాలు చేసినవారు లేరని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 నియామకాలపై తీవ్రంగా స్పందించారు. ఎంతోమంది లీగల్ లిటిగేషన్లకు వెళ్లారు. కానీ.. హైకోర్టు, సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అండగా నిలబడ్డాయని తెలిపారు. మార్చిలో కొత్త నియామకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వివరించారు. మా ప్రభుత్వం ప్రతి దశలో నిరుద్యోగుల ఆశలు నెరవేర్చే ప్రయత్నం చేస్తోందని, యువత కూడా మా ప్రయత్నాన్ని గమనించాలని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ప్రకారం జరుగుతుందని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల భద్రత విషయంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగుల ప్రమాద భీమాకు కోటి రూపాయల నుంచి 1.25 కోట్లు పెంచామని, బ్యాంకర్లతో సింగరేణి ఒప్పందం కూడా చేపట్టామని తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్న డిప్యూటీ సీఎం
ఇక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సివిల్స్ లో మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది 20 మంది విద్యార్థులు సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్లిన విషయం గర్వంగా ఉందని అన్నారు. వారు సెలక్ట్ అయితే మరింత సంతోషం అని తెలిపారు. అలాగే భట్టి విక్రమార్క సింగరేణి పాలనపై కూడా మాట్లాడారు. సింగరేణిని రాజకీయాలకోసం వాడుకోమని, సింగరేణిని ప్రపంచంలో అగ్రగామి సంస్థగా నిలబెడతాం అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!