CM Revanth Reddy: ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం
- "అభయ హస్తం" పేరిట చెక్కులు పంపిణీ చేసిన సీఎం..
- ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం
- పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకు ప్రకటించిన విధంగా సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ “అభయ హస్తం” పేరిట చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్ శాంతికుమారి, మరికొందరు ప్రజాప్రతినిధులు సైతం హాజరయ్యారు.
Also Read: Nara Lokesh: నా ఉద్యోగం తీయించేలా ఉన్నావే.. విద్యార్థితో లోకేశ్ ఛలోక్తి!
Also Read
- GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
ఇక ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొన్ని కీలక నిర్ణయాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏడాదిలో 55,143 ఉద్యోగాలు అందించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చామని, దేశంలో ఎవరూ ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు 14 ఏళ్ల తర్వాత మేమే చేపట్టామని.. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వీటి కోసం పెద్దగా ప్రయత్నాలు చేసినవారు లేరని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 నియామకాలపై తీవ్రంగా స్పందించారు. ఎంతోమంది లీగల్ లిటిగేషన్లకు వెళ్లారు. కానీ.. హైకోర్టు, సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అండగా నిలబడ్డాయని తెలిపారు. మార్చిలో కొత్త నియామకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వివరించారు. మా ప్రభుత్వం ప్రతి దశలో నిరుద్యోగుల ఆశలు నెరవేర్చే ప్రయత్నం చేస్తోందని, యువత కూడా మా ప్రయత్నాన్ని గమనించాలని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ప్రకారం జరుగుతుందని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల భద్రత విషయంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగుల ప్రమాద భీమాకు కోటి రూపాయల నుంచి 1.25 కోట్లు పెంచామని, బ్యాంకర్లతో సింగరేణి ఒప్పందం కూడా చేపట్టామని తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్న డిప్యూటీ సీఎం
ఇక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సివిల్స్ లో మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది 20 మంది విద్యార్థులు సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్లిన విషయం గర్వంగా ఉందని అన్నారు. వారు సెలక్ట్ అయితే మరింత సంతోషం అని తెలిపారు. అలాగే భట్టి విక్రమార్క సింగరేణి పాలనపై కూడా మాట్లాడారు. సింగరేణిని రాజకీయాలకోసం వాడుకోమని, సింగరేణిని ప్రపంచంలో అగ్రగామి సంస్థగా నిలబెడతాం అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!