K Laxman: కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం.. బీజేపీ ఎంపీ ఫైర్
- తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించిన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
- రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని ఎగవేతలేనన్న ఎంపీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Laxman: బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని ఎగవేతలే అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ సభలో 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 12 వేలకు కోత పెట్టిందని తెలిపారు. మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ నీటి మూటలే అంటూ ఎద్దేవా చేసారు. కౌలు రైతులను రైతు భరోసా పథకంలో మర్చిపోయారని ఆయన విమర్శించారు.
Also Read: DK Aruna: రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ప్రభుత్వం దగ్గర రైతుల డేటా మొత్తం ఉన్నప్పుడు కొత్తగా సర్వేలు అవసరమేంటని డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. రైతు భరోసా పథకం ప్రారంభాన్ని సంక్రాంతి నుండి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు జనవరి 26 అంటున్నారు. ఇది ప్రభుత్వ అజమాయిషీని చూపిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ రైతులకు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రైతుల కోసం ఉద్యమం చేస్తామని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామంటూ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
Also Read: Addanki Dayakar: రైతు భరోసాపై విమర్శలు చేసే వారికి అద్దంకి దయాకర్ కౌంటర్
అంతేకాకుండా.. కాంగ్రెస్ అంటేనే మోసానికి నిర్వచనమని.. రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి వరకు ప్రజలను, రైతులను మోసం చేసిన వారే అంటూ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేమని కాంగ్రెస్ నేతలు నేలకు ముక్కు రాసి ప్రజలను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రైతాంగానికి సకాలంలో న్యాయం చేయడం బీజేపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!