K Laxman: కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం.. బీజేపీ ఎంపీ ఫైర్
- తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించిన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
- రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని ఎగవేతలేనన్న ఎంపీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Laxman: బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని ఎగవేతలే అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ సభలో 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 12 వేలకు కోత పెట్టిందని తెలిపారు. మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ నీటి మూటలే అంటూ ఎద్దేవా చేసారు. కౌలు రైతులను రైతు భరోసా పథకంలో మర్చిపోయారని ఆయన విమర్శించారు.
Also Read: DK Aruna: రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ప్రభుత్వం దగ్గర రైతుల డేటా మొత్తం ఉన్నప్పుడు కొత్తగా సర్వేలు అవసరమేంటని డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. రైతు భరోసా పథకం ప్రారంభాన్ని సంక్రాంతి నుండి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు జనవరి 26 అంటున్నారు. ఇది ప్రభుత్వ అజమాయిషీని చూపిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ రైతులకు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రైతుల కోసం ఉద్యమం చేస్తామని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామంటూ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
Also Read: Addanki Dayakar: రైతు భరోసాపై విమర్శలు చేసే వారికి అద్దంకి దయాకర్ కౌంటర్
అంతేకాకుండా.. కాంగ్రెస్ అంటేనే మోసానికి నిర్వచనమని.. రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి వరకు ప్రజలను, రైతులను మోసం చేసిన వారే అంటూ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేమని కాంగ్రెస్ నేతలు నేలకు ముక్కు రాసి ప్రజలను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రైతాంగానికి సకాలంలో న్యాయం చేయడం బీజేపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!