రెడ్ జోన్ పరిధిలోకి ఆర్కే బీచ్ ఏరియా: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ఏరియా తాత్కాలిక రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది. నేటి నుంచి 96 గంటల పాటు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ఆంక్షలు కొనసాగుతాయని వైజాగ్ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు. 5 కిలో మీటర్ల పరిధిలో ప్రైవేట్ డ్రోన్లను ఎగురవేయడం, నిరసనలు, ర్యాలీలు చేపట్టడం లాంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు…
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఇటీవల విచారించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. నేడు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు మొదటి సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్నది సిట్. పీసీసీ చీఫ్…
Vemulawada : దశాబ్దకాలంగా వాయిదా పడుతూ వచ్చిన వేములవాడ పట్టణంలోని రోడ్ వెడల్పు పనులకు ఆదివారం అధికారులు ప్రారంభసూచి ఇచ్చారు. మటన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ దుకాణాలను అధికారుల పర్యవేక్షణలో జేసీబీలతో కూల్చివేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజన్న ఆలయం వరకు రోడ్డును 80 అడుగుల వెడల్పుతో విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.47 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 260 నిర్వాసితులలో…
Balmuri Venkat : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే క్రమంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ వేశారు. “చట్టంపై గౌరవం ఉందని చెబుతున్న కేటీఆర్ అదే సమయంలో విచారణను డైవర్ట్ చేయడానికి నాటకాలాడుతున్నాడు” అంటూ ఆయన విమర్శించారు. ప్రజల ఎదుట తాను నిర్దోషినంటూ సత్యహరిశ్చంద్రుడిలా నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మేం ఎవరినీ బలవంతంగా పిలవలేం కానీ, ఒక…
Suicide : హైదరాబాద్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎర్రగడ్డలోని జనప్రియ అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఓ మహిళ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శనివారం (14-06-2025) ఉదయం 8:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం… ఆత్మహత్య చేసుకున్న మహిళ పేరు కొక్కినీ శ్రావణి (30), ఆమె తిమ్మాపురం, ఏలూరు జిల్లా వాసి. కొద్ది నెలల క్రితమే హైదరాబాద్కు వలసవచ్చి, జనప్రియ…
Food Safety Raids : గోల్కొండ ఫోర్ట్ సమీపంలోని బడా బజార్ ప్రాంతంలో నిబంధనలకీ నాణ్యతకీ వ్యతిరేకంగా నడుస్తున్న సమోసా తయారీ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టీమ్ అక్కడికి వెళ్లి తనిఖీలు చేసింది. కమిషనర్ ఆదేశాలతో జరిగిన ఈ తనిఖీల్లో అనేక అధ్వాన్న పరిస్థితులు బయటపడ్డాయి. ఆ సెంటర్కు సరైన లైసెన్స్ లేకపోవడమే కాక, చాలా అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు అక్కడ తయారీని నిలిపివేశారు.…
Leopard : సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని బీబీపేట్ గ్రామంలో శనివారం ఉదయం చిరుతపులి కనిపించడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. స్థానికంగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుండు మోహన్ ఇంట్లోకి చిరుత చొరబడి కొంతసేపు అక్కడే సంచరించిన దృశ్యాలు ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వీడియోలు ఇప్పుడు గ్రామంలో వైరల్ అవుతున్నాయి. ఇంటి ఆవరణలో చిరుత కనిపించగానే గుండు మోహన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై తక్షణమే ఇంటి నుంచి…
Harish Rao : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు నిధుల పంపిణీ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. గత 16 నెలలుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు అందకుండా ఉండటాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. Ukraine Russia War: ఉక్రెయిన్ బంపర్ ఆఫర్.. రష్యన్ డ్రోన్లను కూల్చేస్తే నెలకు రూ. 2…
Snake : హనుమకొండ జిల్లా కమలాపూర్లోని ఓ పాఠశాలలో బుధవారం ఉదయం విద్యార్థినులకు ఓ ఆందోళనకర అనుభవం ఎదురైంది. వారు రోజూ ఉపయోగించే టాయిలెట్లో ఓ భారీ కొండచిలువ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, కమలాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతిగృహంలోని టాయిలెట్లో దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ కనిపించింది. ఉదయం శుభ్రత పనులు జరుగుతున్న సమయంలో స్కూల్ సిబ్బంది ఈ దృశ్యాన్ని గుర్తించి షాక్కు…
సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలలో గంజాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి. మంగ్లీ పోలీసుల మీద విరుచుకుపడుతున్నట్టుగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మంగ్లీ ఫోటో వాడుతూ ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మంగ్లీ ఈ విషయం మీద స్పందించింది. ఈ మేరకు…