CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తూ భారీగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన వాటాలో తీవ్ర అన్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తూ ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం పెద్దపీట వేస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా పన్నుల పునఃపంపిణీలో కేంద్రం అనుసరిస్తున్న తీరును ఆయన గణాంకాలతో సహా ఎండగట్టారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న ప్రతి రూపాయికి ప్రతిఫలంగా రాష్ట్రానికి…
Charlapalli Case Solved: బోడుప్పల్కు చెందిన సాఫ్ట్వేర్ టీమ్ లీడర్ విజయశాంతిరెడ్డి (38), తన కుమార్తె చైతన్య రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17)తో కలిసి జనవరి 31 తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్న సమయంలో వీరు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో మిస్టరీ కొనసాగగా, తాజాగా పోలీసుల విచారణలో…
హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) కార్యాలయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నేర పరిశోధనలో అత్యంత కీలకమైన సాక్ష్యాధారాలను భద్రపరిచే చోట మంటలు చెలరేగడంతో, పలు కేసుల్లో సేకరించిన భౌతిక ఆధారాలు (Physical Evidence) పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంపై డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతూ విస్తుపోయే వివరాలను వెల్లడించారు. మంటలు వ్యాపించిన తీరు, జరిగిన ఆస్తి నష్టం, కేసులపై పడే ప్రభావం గురించి ఆయన…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు నిర్దేశించిన గడువు నేటితో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అభ్యర్థుల తుది జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ రాత్రి లోపు లేదా రేపు ఉదయానికల్లా అధికారికంగా పోటీలో ఉన్న అభ్యర్థుల పూర్తి వివరాలను ఎస్ఈసీ ప్రకటించనుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ , బీజేపీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర…
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ (SIT) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు పలు కీలక అంశాలపై సంతోష్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం చుట్టూ ప్రశ్నలను సంధించారు. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ విభాగం…
సింగరేణి సంస్థలో జరుగుతున్న టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతను పక్కన పెట్టి, తన సొంత బంధువులకు , అనుకూలమైన కాంట్రాక్టర్లకు మేలు చేసేలా నిబంధనలను మార్చిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా సంస్థకు చెందిన నిధులను పక్కదారి పట్టిస్తూ, బొగ్గు గనుల టెండర్లలో వేల కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపారని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. తెలంగాణ జీవనాడి అయిన సింగరేణి…
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రధాన ఘట్టాలు కింది విధంగా ఉన్నాయి.. Online Dating App Scam: దూల తీర్చేసిన డేటింగ్ యాప్.. గంట ముచ్చటకి నెల జీతం హాంఫట్! ఎన్నికల కీలక షెడ్యూల్…
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు. UGC Protests:…
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీకి (BJP) షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన, తాజాగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్, అక్కడ ఇమడలేకనే తిరిగి సొంత గూటికి…
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టేషన్లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎక్కడా రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4000 ఆర్టీసీ బస్సులను…