Rythu Bharosa: రైతు భరోసా నిధుల పంపిణీలో రికార్డు.. కేవలం 6 రోజుల్లో రూ. 7700 కోట్లు..!
- రైతు భరోసా నిధుల పంపిణీలో రికార్డు
- కేవలం 6 రోజుల్లో రూ. 7700 కోట్లు
- 16వ తేదీన రైతు నేస్తం వేదిక పంపిణీ షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు భరోసా నిధుల పంపిణీలో రికార్డు సృష్టించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 6 రోజుల్లో రూ. 7700 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఏడేండ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇదే రికార్డు అని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందించటంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈసారి వేగంగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది.
READ MORE: Snakebite: వర్షాకాలంలో పాముల సంచారం.. పాము కరిస్తే వెంటనే ఇలా చేయండి..
Also Read
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Bharat tiwari: బీహార్ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
- Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- Padma Awards: 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేత.. మమ్ముట్టి, మాధవన్కు గౌరవం
ఈసారి జూన్ 16వ తేదీన రైతు నేస్తం వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. తొలి ఆరు రోజుల్లోనే 66.19 లక్షల మంది రైతులకు రూ. 7770.83 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. శనివారం నాటికే రాష్ట్రంలో 9 ఎకరాల్లోపు భూములున్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి. గడిచిన ఏడేండ్లలో ఇంత వేగంతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం ఇదే మొదటిసారి.
READ MORE: IWMBuzz Digital Awards: ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న మాళవిక మోహనన్..!
వానాకాలం పంటలకు సంబంధించి గతంలో రైతులకు పంటలకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం గరిష్టంగా 169 రోజుల వరకు సాగదీసినట్లు పంపిణీ చేసింది. వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2021లో 11 రోజుల వ్యవధిలో రూ.7360 కోట్లు జమ చేయటం ఇప్పటి వరకు ఉన్న రికార్డు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంతకంటే వేగంగా 6 రోజుల్లోనే రూ.7770 కోట్లు పంపిణీ చేసింది. తొమ్మిది రోజుల్లో మొత్తం రూ. 9 వేల కోట్ల పంపిణీని విజయవంతంగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
తాజావార్తలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
-
Vijay – Trisha Breakup; ఒక్క పోస్టుతో అందరి నోళ్ళు మూయించిన త్రిష
-
Bharat tiwari: బీహార్ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?