శ్రీ ఫ్లవ నామ సంవత్సరం మరికొద్ది గంటల్లో ముగుస్తుంది. శుభకృత్ నామ సంవత్సరం రాబోతోంది. శ్రీ ఫ్లవనామ సంవత్సరం చివరిరోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
బాయిల్డ్ రైస్ ఎవరూ ఉపయోగించరు. పిల్లలు కూడా బాయిల్డ్ రైస్ తినడం లేదు. ఆయా రాష్టాలు ఉత్పత్తి తగ్గించాయ్. 3400 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ కోసం 2014లో కేంద్రం ఖర్చు చేసింది. 26,600 కోట్లు గత ఏడాది ఖర్చు పెట్టాం. బాయిల్డ్ రైస్ వేర్ హౌజెస్ లో నిల్వ ఉంటున్నాయి.రా రైస్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కోటా ఇంకా ఇవ్వలేదు.బాయిల్డ్ రైస్ కు ఆదరణ లేదు. హుజురాబాద్ ఎన్నికల తర్వాతే బాయిల్డ్ కొనాలనే అంశం…
కేంద్రంలో బీజేపీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యునివర్సిటీ, ఉక్కు ఫ్యాక్టరీకి భూమి ఇచ్చినా ఇవ్వలేదన్న మెంటల్ పార్టీ బీజేపీ అంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేంద్రం తీరుకు బాధతో వరి పంట వేయవద్దని చెప్పారు. కేంద్రం రా రైస్ ను కొనుడు కాదు..ఒడ్లు కొనేవరకు వదిలిపెట్టేది లేదు. గ్రామాలలో…
వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక ముగ్గరు పిల్లలతో సహ అగ్నికి ఆహుతి అయిన కేసులో మాజీ ఎంపీ రాజయ్య కు ఊరట లభించింది.. హైదరాబాద్ స్పెషల్ కోర్టులో రాజయ్యతో సహా నిందితులుగా ఉన్న ఆయన కొడుకు భార్యలను కూడా కోర్టు నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ, సిరిసిల్ల రాజయ్య ఇంటిలో 2015 నవంబర్ 4 తెల్లవారుజామున అగ్ని ప్రమాదం…
ఎంతకైనా పోరాటం చేస్తాం. ఎంతో రిస్క్ చేసి, పంటలు పండిస్తే ఇన్ని అవరోధాలా. కేంద్రం సమర్థత సరిగా లేదు. దేశంలో ఇలాగే ముందుకు పోతే నష్టాల పాలవుతారు జనం. ప్రజలకు జరుగుతున్నది తెలపాలి. మోడీకి చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాం. బీజేపీకి ఉద్యోగాలివ్వడం తేలీదు. ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చేయడం లేదు. ఇది రైతుల జీవన్మరణ సమస్య. రాజ్యాంగ విధి నుంచి కేంద్రం పారిపోవద్దు. కరోనాలాంటిది వస్తుందని మనం భావించామా? వారం పాటు దేశానికి అన్నం పెట్టే అవకాశం వుందా?…
కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ ఆవరణలోని చెట్లు పొదల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించారు. ప్రమాదం కారణంగా యూనివర్శిటీలో పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి మంటలు. బాయ్స్ హాస్టల్ సమీపం నుంచి ఎంబీఏ కాలేజీ ఆవరణం వరకూ విస్తరించాయి మంటలు. శాతవాహన యూనివర్సిటీ లో ఉన్న…
నిన్నమొన్నటివరకూ చలికాలం చంపేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పులి పంజా విసిరింది. చలికాలం విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ సూరీడు మండిపోతున్నాడు. సెగలు కక్కుతూ.. విరుచుకుపడుతున్నాడు. శివరాత్రి ముగిసిన వెంటనే చలి తగ్గుతుంది కానీ మరీ ఇంత వేడి వుండడం అరుదు అంటున్నారు జనం. వేసవికాలం వచ్చేసిందనడానికి దండి కొడుతున్న ఎండలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా నమోదవుతూ.. జనాలను హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలో గురువారం అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీల…
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయిందని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.. మరి మిగతా లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఇది 40లక్షల కుటుంబాల సమస్య. తెలంగాణ లో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించండి. 90 వేల ఉద్యోగాలు ఇచ్చి 39లక్షల మంది నోట్లో మట్టి కొడుతున్నారు. నిరుద్యోగం పై లోతైన చర్చ జరగాలి…అఖిలపక్షంతో చర్చించాలన్నారు. నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు…
National Students Union Of India (NSUI) Protest at Front on TSPSC Office. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ‘ఛలో టీఎస్పీఎస్సీ’కి పిలుపునిచ్చింది. దీంతో నాంపల్లిలో బుధవారం మధ్యాహ్నం ఎన్ఎస్యూఐ కార్యకర్తలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్ఎస్యూఐ పిలుపు మేరకు విద్యార్థులు టీఎస్పీఎస్సీ భవనం సమీపంలోని గాంధీ భవన్లో గుమిగూడారు. అక్కడ అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.…
Professor Kodandaram Made Comments On TRS Government. మెదక్లోని టీఎన్జీవో భవన్లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, ప్రశ్నించే నేతలను జైల్లో పెడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని అడిగితే అరెస్ట్ చేసి స్టేషన్ కు పంపారని ఆయన ఆరోపించారు. మల్లన్న సాగర్ రైతులు న్యాయం చేయమని అడిగినందుకు ఆ గ్రామాల్లో 144…