Bhupalapally – రోజు కూలీ 30రూ. లేనా! ఉపాధి కూలీల ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపాధి కూలీలు రోడ్డెక్కారు. పనులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఎంత కష్టపడిన రోజుకూలీకి మాత్రం సరైన ధర ఇవ్వడంలేంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాళం కష్టపడిన పై యజమానులిచ్చే కూలీ సరిపోవడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడితే వారికి వచ్చే రూ.30 మాత్రమేనా అంటూ ప్రశ్నించారు. కనీస ధర కూడా ఇవ్వకుండా మా శ్రమను యజమాను దోచుకుంటున్నారని మండి పడ్డారు. ఈఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
భూపాలపల్లి జిల్లా లోని గణపురం మండల కేంద్రంలోని పెద్దమ్మ కుంట వద్ద జరుగుతున్న ఉపాధి పనులు బహిష్కరించి కూలీలు ధర్నా చేపట్టారు. గత కొద్ది రోజులుగా పనిచేస్తున్నా రోజుకు కనీసం రూ.30 నుండి 70 రూపాయల లోపు ఆదాయం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపైసలతో కుటుంబాన్ని పోషించుకునలేక పోతున్నామని అన్నారు. ఇప్పుడు నిత్యావసర సరకుల ధరలు ఆకాశానంటాయని వాటిని కొనడానికి రూ.30 సరిపోతాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడినా పై యజమానులు ఇచ్చే ఆదాయం కుటుంబానికి సరిపోవడం లేదని ఆవదేన వ్యక్తం చేశారు. ఈ కొద్ది ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని వాపోయారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
పిల్లలకు ఫీజులు కట్టాలన్నా, నిత్యావసర సరుకులు కొనాలన్నా చాలా కష్టంగా మారిందని వారికడుకోతును వెలిబుచ్చుకున్నారు. రోజంతా కుటుంబానికి దూరంగా వుంటూ ఎంత పనిచేసిన సరైన కూలీ రావండం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సంబంధిత శాఖ అధికారులు ఫీల్డ్ మీదికి రావడం లేదని ఆందోళన చేపట్టారు. కూలీలకు కనీస వసతులు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు పనిచేసే చోట ఏర్పాటు చేయడం లేదని కూలీలు వాపోయారు. కనీస సౌకర్యాలపై పట్టించుకునే నాథుడే కరువయ్యారని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఉపాధి కూలీలు పనులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ములుగు పరకాల ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.సంబంధిత శాఖ అధికారులు ఫీల్డ్ మీదికి రాకపోవడంతో.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోజువారి ఆదాయం పెంచాలని కోరారు. రోజువారిపనికి సరైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!