Medchal:కుళ్లిపోయిన మహిళ మృతదేహం, కొడుకు పై అనుమానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపూరి కాలనీలోని దారుణం జరిగింది. మైత్రి నివాస్ అపార్టుమెంట్లోని 202 నెంబర్ ఫ్లాట్లో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. తల్లి మృతదేహంతో పాటు మూడు రోజులుగా అపార్ట్మెంట్లోనే కుమారుడు ఉన్నాడు. సాయి కృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని తరచూ తల్లి, కొడుకులు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు.
కొడుకు మానసిక స్థిమితం బాగా లేకపోవడంతో కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండడంతో అపార్ట్మెంట్ వాసులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన మహిళ విజయ(50) అని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఘటనే.. సూర్యాపేట జిల్లాలోని మోతెలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి జనార్దన్రెడ్డి అనే వృద్ధుడిని దుండగులు కత్తులతోపొడిచి హత్య చేశారు. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థాలానికి చేరుకన్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. భూవివాదమే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే .. గురువారం కోయిలసాగర్ డాంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్య మయింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో గుర్తు తెలియని మహిళ(55) మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి మృతదేహాని పోసమార్టం నిమ్మితం జిల్లా ఆసుపత్రికి తరలించిన దేవరకద్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా.. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం జైత్రామ్ తండాలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గ్రామ శివారులో కంచ లో పడి ఉంది. వారం రోజుల క్రితం మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనపరచుకొని విచారిస్తున్నట్లు వాడపల్లి పోలీసులు తెలిపారు.
ఒక పక్క హత్యలు, మరో పక్క మృతదేహాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరుస హత్యలు పోలీసులకు సవాల్ విసురుతుంటే , అనుమానంతో కొందరు కుటుంబ సభ్యులనే కడతేర్చడం రక్షక భటులకు తలనొప్పిగా మారాయి. ఈ ఘటలపై పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఏ నిమిషంలో.. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో పడ్డారు. ఏదీఏమైనా.. వరుస హత్యలతో పోలీసులకు సవాల్ విసురుతున్న నేరగాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు మన పోలీసు బాసులు.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!