Governor Tamilisai: ఇబ్రహీంపట్నం ఘటనకు ఆ రెండే అసలు కారణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Tamilisai Meets Ibrahimpatnam Victims In NIIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో ఇబ్రహీంపట్నం ఘటన బాధితుల్ని పరామర్శించిన గవర్నర్ తమిళిసై.. నిమ్స్లో ట్రీట్మెంట్ పట్ల బాధితులు సంతృప్తిగానే ఉన్నారని అన్నారు. అయితే.. వాళ్లు ఆర్థిక సహాయం కోరుతున్నారని, ఆ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సహాయం చేయాలని తాను సూచిస్తానని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరాృతం కాకూడదని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తానని వెల్లడించారు. ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్తో ఇలాంటి పనులకు పాల్పడకూడదన్నారు. కుటుంబ నియంత్రణ అంటే, మరింత మంది ముందుకు వచ్చేలా చేయాలి గానీ.. ఇలా చేస్తే ముందుకు వచ్చే వాళ్ల ధైర్యం కూడా దెబ్బ తింటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సజావుగా, మంచిగా జరగాలని.. ఇదే అంశంపై ప్రభుత్వానికి సూచనలు ఇస్తానని గవర్నర్ తెలిపారు. నలుగురు చనిపోవడమన్నది మామూలు విషయం కాదని, ఇది ఆమోదయోగ్ం కాదని అన్నారు. ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత పూర్తి కారణాలేంటో వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్, ఇన్ఫెక్షన్ వల్లే ఇలా జరిగి ఉంటుందని ఒక డాక్టర్గా తాను భావిస్తున్నానన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్తానని, అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటానని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాల్సిందిగా తాను ప్రభుత్వానికి లేఖ రాస్తానని, ఆ చర్యలు వేగవంతం అయ్యేలా తాను చూసుకుంటానని గవర్నర్ తమిళిసై హామీ ఇచ్చారు.
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
కాగా.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రన ఆపరేషన్ చేయగా, దురదృష్టవశాత్తూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారికి వివిధ ఆసుపత్రిల్లో చికిత్స అందించారు. వారిలో కొందరు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని సమాచారం. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) శ్రీనివాస్ అన్నారు. వైద్యులను ప్రత్యేకంగా విచారించిన తర్వాత, పూర్తి రిపోర్ట్ను సిద్ధం చేయనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!