Axar Patel: టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. అక్షర్ తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు. అతను తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. అతని భార్య మేహా పటేల్ గర్భవతి. గతేడాది జనవరిలో గుజరాత్లోని వడోదరలో మేహా పటేల్ను వివాహం చేసుకున్నాడు. అతని భార్య మేహా డైటీషియన్, న్యూట్రిషనిస్ట్. ఇంతకుముందు, అక్షర్ ఇటీవల కపిల్ శర్మ కామెడీ షోలో ఈ…
Here is Hong Kong Sixes Tournament Rules: ఐకానిక్ క్రికెట్ టోర్నమెంట్ ‘హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్’ మరలా అభిమానులను అలరించడానికి సిద్దమైంది. ఈ టోర్నీ నవంబర్ 1 నుంచి 3 వరకు జరగనుందని క్రికెట్ హాంకాంగ్ సోమవారం తన ఎక్స్ ద్వారా తెలిపింది. 1992లో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. 2017 వరకు కొనసాగింది. 2017 నుంచి 2023 వరకు ఏడేళ్ల పాటు నిర్వహించలేదు. 2024లో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి తిరిగి వస్తోంది. ఈ టోర్నీలో…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ టోర్నీకి భారత్తో పాటు అన్ని జట్లూ పాకిస్థాన్కు వస్తాయనడంలో సందేహం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నక్వీ అన్నారు. రాజకీయ సమస్యల కారణంగా భారత్, పాకిస్థాన్ల మధ్య చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదని చెప్పారు. ఈ రెండు జట్లు బహుళ-దేశాల టోర్నమెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఛాంపియన్స్…
Sanath Jayasuriya: శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తన జట్టుకు మార్చి 31, 2026 వరకు మాజీ వెటరన్ ఆటగాడు సనత్ జయసూర్యను కోచ్గా నియమించింది. ప్రస్తుతం జయసూర్య జట్టుకు తాత్కాలిక కోచ్గా ఉన్నారు. భారత్తో స్వదేశంలో జరిగిన సిరీస్కు, ఆ తర్వాత జరిగిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ లతో జరిగిన టెస్టు సిరీస్కు కోచ్గా నియమించబడ్డాడు. ఇకపోతే జయసూర్య కోచ్గా వచ్చిన తర్వాత శ్రీలంక ఆటతీరు అద్భుతంగా కొనసాగింది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత క్రిస్ సిల్వర్…
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను ఇటీవల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అక్టోబర్ 31వ తేదీ లోపు అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్ను సమర్పించాల్సి ఉంటుంది. వేలం నవంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వేలం సందర్భంగా ప్రాంచైజీలకు పెద్ద బొక్క పడే అవకాశం…
ఏ జట్టుకైనా అత్యుత్తమ ఫినిషర్ అవసరం కానీ.. టీమిండియాకు మాత్రం డబుల్ ధమాకా లాంటి ఇద్దరు ఫినిషర్లు ఉన్నారని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ బెస్ట్ ఫినిషర్లు అవుతారన్నాడు. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్లో ఈ ఇద్దరు అత్యంత కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో ఆల్ ఫార్మాట్ బెస్ట్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అని డీకే చెప్పుకొచ్చాడు. నేడు బంగ్లాదేశ్తో భారత్…
టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ టాప్ ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. ఆ తర్వాత.. మరో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. బుమ్రా ఇటీవల బంగ్లాదేశ్తో ఆడిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మరో పదేళ్లు భారత జట్టుకు ఎలాంటి డోకా లేదని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (బీసీఈ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. మరో పదేళ్లు భారత్ ఆధిపత్యం చెలాయించడానికి కావాల్సినంత మంది ఆటగాళ్లు దేశంలో ఉన్నారన్నారు. పురుషుల్లోనే కాదు మహిళల క్రికెట్లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారని చెప్పారు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం బీసీఈ శిక్షణ శిబిరంలో భారత మహిళల జట్టు తీవ్రంగా శ్రమించిందని లక్ష్మణ్ తెలిపారు. బీసీఈ కొత్త సెంటర్ను ప్రారంభించిన…
టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డుల మోత మోగించింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. కేవలం 3 ఓవర్లలోనే 50 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన రోహిత్, జైస్వాల్ జోడీ.. ఆ తర్వాత అత్యంత వేగంగా 100, 150, 200 రన్స్ కూడా భారత్ చేసింది.
భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో రోజురోజుకు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అతను తన పేరిట ఒక పెద్ద రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.