ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి టీమిండియా ఫాస్ట్ బౌలర్..
- టెస్టు ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానానికి చేరిన జస్ప్రీత్ బుమ్రా
- ప్రపంచ టాప్ ఫాస్ట్ బౌలర్గా నిలిచిన బుమ్రా
- తర్వాత స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ టాప్ ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. ఆ తర్వాత.. మరో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. బుమ్రా ఇటీవల బంగ్లాదేశ్తో ఆడిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు.. యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్, వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ర్యాంకింగ్స్లో మెరుగుపడ్డారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో బుమ్రా 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో.. ఒక్క స్థానానికి ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. 870 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అశ్విన్ రెండో స్థానంలో 869 పాయింట్లతో ఉన్నాడు.
Career Guide: 10వ తరగతి తర్వాత ఈ కోర్సులు నేర్చుకుంటే లైఫ్ సెటిల్..
Also Read
టెస్ట్ ర్యాంకింగ్స్లో బుమ్రా అగ్రస్థానానికి చేరుకోవడం ఇది రెండోసారి. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఇంగ్లండ్తో జరిగిన సిరీస్ తర్వాత మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత మూడు స్థానాలు దక్కించుకున్నాడు. టాప్ టెస్ట్ బౌలర్గా అవతరించిన తొలి భారత ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. బుమ్రా కంటే ముందు.. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ టెస్ట్ బౌలర్లలో అత్యధిక ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ బౌలర్గా ఉన్నాడు. డిసెంబర్ 1979, ఫిబ్రవరి 1980 మధ్య రెండవ స్థానంలో నిలిచాడు.
Slow Eating: ఆహారాన్ని నమిలి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్కు చెందిన మెహదీ హసన్ మిరాజ్ నాలుగు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్కు చేరుకున్నాడు. స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 28వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. 792 పాయింట్లతో ఉండగా.. నాలుగు ఇన్నింగ్స్ల్లో అతను 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. బ్యాట్స్మెన్ టెస్టు ర్యాంకింగ్స్లో జో రూట్ అగ్రస్థానంలో ఉండగా, కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు.. కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టాప్ 10 లో ఉన్నాడు. కాన్పూర్ టెస్టులో 47, 29* పరుగుల ఇన్నింగ్స్లు ఆడి భారత విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. దీంతో ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో ఉన్నాడు. పంత్ మూడు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!