ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి టీమిండియా ఫాస్ట్ బౌలర్..
- టెస్టు ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానానికి చేరిన జస్ప్రీత్ బుమ్రా
- ప్రపంచ టాప్ ఫాస్ట్ బౌలర్గా నిలిచిన బుమ్రా
- తర్వాత స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ టాప్ ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. ఆ తర్వాత.. మరో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. బుమ్రా ఇటీవల బంగ్లాదేశ్తో ఆడిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు.. యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్, వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ర్యాంకింగ్స్లో మెరుగుపడ్డారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో బుమ్రా 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో.. ఒక్క స్థానానికి ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. 870 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అశ్విన్ రెండో స్థానంలో 869 పాయింట్లతో ఉన్నాడు.
Career Guide: 10వ తరగతి తర్వాత ఈ కోర్సులు నేర్చుకుంటే లైఫ్ సెటిల్..
Also Read
టెస్ట్ ర్యాంకింగ్స్లో బుమ్రా అగ్రస్థానానికి చేరుకోవడం ఇది రెండోసారి. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఇంగ్లండ్తో జరిగిన సిరీస్ తర్వాత మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత మూడు స్థానాలు దక్కించుకున్నాడు. టాప్ టెస్ట్ బౌలర్గా అవతరించిన తొలి భారత ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. బుమ్రా కంటే ముందు.. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ టెస్ట్ బౌలర్లలో అత్యధిక ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ బౌలర్గా ఉన్నాడు. డిసెంబర్ 1979, ఫిబ్రవరి 1980 మధ్య రెండవ స్థానంలో నిలిచాడు.
Slow Eating: ఆహారాన్ని నమిలి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్కు చెందిన మెహదీ హసన్ మిరాజ్ నాలుగు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్కు చేరుకున్నాడు. స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 28వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. 792 పాయింట్లతో ఉండగా.. నాలుగు ఇన్నింగ్స్ల్లో అతను 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. బ్యాట్స్మెన్ టెస్టు ర్యాంకింగ్స్లో జో రూట్ అగ్రస్థానంలో ఉండగా, కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు.. కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టాప్ 10 లో ఉన్నాడు. కాన్పూర్ టెస్టులో 47, 29* పరుగుల ఇన్నింగ్స్లు ఆడి భారత విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. దీంతో ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో ఉన్నాడు. పంత్ మూడు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?