Team India: 147 ఏళ్లలో తొలిసారిగా.. భారత ఆల్ రౌండర్ రికార్డ్
- రికార్డు సృష్టించిన భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా
- టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు
- 147 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయలేని రికార్డు ఇప్పుడు జడేజా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో రోజురోజుకు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అతను తన పేరిట ఒక పెద్ద రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో, జడేజా మొదటి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసుకున్నాడు. 147 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయలేని రికార్డు ఇప్పుడు జడేజా చేశాడు. తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు.. 200కు పైగా వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. జడేజా తర్వాత అశ్విన్ ఉన్నాడు. అతను టెస్ట్ క్రికెట్లో 1943 పరుగులు, 369 వికెట్లు పడగొట్టాడు.
Read Also: Headache: ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా..? కారణాలివే
Also Read
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
- FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్లోకి స్పెయిన్.!
- ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్వాష్ను భారత్ తప్పించుకుంటుందా.?
- Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
35 ఏళ్ల ఆల్ రౌండర్ కాన్పూర్ టెస్టులో భారీ రికార్డుపై కన్నేశాడు. ఒక్క వికెట్ తీయడం ద్వారా టెస్టు క్రికెట్లో 300 వికెట్లు పూర్తి చేస్తాడు. దీంతో కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్గా అవతరించనున్నాడు. రాబోయే మ్యాచ్లో ఒక వికెట్ తీస్తే.. అతను తన పేరు మీద 300 టెస్ట్ వికెట్లు నమోదు చేయడమే కాకుండా, ఈ ఫార్మాట్లో 300 వికెట్లు, 3000 పరుగులు పూర్తి చేసిన 11వ ఆటగాడిగా అవతరిస్తాడు. అలాగే.. భారత్ తరుఫున ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. జడేజా కంటే ముందు భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (434 వికెట్లు, 5248 పరుగులు), వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (522 వికెట్లు, 3422 పరుగులు) ఈ ఘనత సాధించారు.
Read Also: Liam Livingstone: లివింగ్స్టోన్ ఊచకోత.. ఒకే ఓవర్లో 28 రన్స్
తాజావార్తలు
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!