Team India: 147 ఏళ్లలో తొలిసారిగా.. భారత ఆల్ రౌండర్ రికార్డ్
- రికార్డు సృష్టించిన భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా
- టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు
- 147 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయలేని రికార్డు ఇప్పుడు జడేజా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో రోజురోజుకు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అతను తన పేరిట ఒక పెద్ద రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో, జడేజా మొదటి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసుకున్నాడు. 147 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయలేని రికార్డు ఇప్పుడు జడేజా చేశాడు. తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు.. 200కు పైగా వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. జడేజా తర్వాత అశ్విన్ ఉన్నాడు. అతను టెస్ట్ క్రికెట్లో 1943 పరుగులు, 369 వికెట్లు పడగొట్టాడు.
Read Also: Headache: ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా..? కారణాలివే
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
35 ఏళ్ల ఆల్ రౌండర్ కాన్పూర్ టెస్టులో భారీ రికార్డుపై కన్నేశాడు. ఒక్క వికెట్ తీయడం ద్వారా టెస్టు క్రికెట్లో 300 వికెట్లు పూర్తి చేస్తాడు. దీంతో కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్గా అవతరించనున్నాడు. రాబోయే మ్యాచ్లో ఒక వికెట్ తీస్తే.. అతను తన పేరు మీద 300 టెస్ట్ వికెట్లు నమోదు చేయడమే కాకుండా, ఈ ఫార్మాట్లో 300 వికెట్లు, 3000 పరుగులు పూర్తి చేసిన 11వ ఆటగాడిగా అవతరిస్తాడు. అలాగే.. భారత్ తరుఫున ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. జడేజా కంటే ముందు భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (434 వికెట్లు, 5248 పరుగులు), వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (522 వికెట్లు, 3422 పరుగులు) ఈ ఘనత సాధించారు.
Read Also: Liam Livingstone: లివింగ్స్టోన్ ఊచకోత.. ఒకే ఓవర్లో 28 రన్స్
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!