Home
Team India
Team India News
-
క్రీడలంటే ప్రభుత్వాలకు చిన్నచూపా..?
గేమ్ ఏదైనా.. మనోళ్లు పతకం కొట్టాల్సిందే అనుకుంటాం. గెలిస్తే… భుజాలకెత్తుకుంటాం. ఓడిపోతే.. నేలకేసి కొడతాం. ఇదే మనకు తెలిసిన పద్ధతి. ఆడేవారికి ప్రోత్సాహాన్నిద్దాం అనే ఆలోచన మాత్రం ఉండదు. విజయం సాధించాలనే ఆకాంక్ష ఎంత బలంగా ఉంటుందో.. గెలవడానికి జరిగే కసరత్తులో కనీస ప్రోత్సాహం ఉండదు. అంతర్ జిల్లా పోటీల నుంచి మొదలుకుని.. అంతర్జాతీయ గేమ్స్ వరకు అన్నింట్లో మనవాళ్లు గెలవాలనుకుంటాం. కానీ దానికి ఓ బలమైన వ్యవస్థ ఉండాలనే వాస్తవాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తాం. ప్రపంచ… -
భారత్ ఖాతాలో మరో కాంస్యం…
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో పథకం వచ్చి చేరింది. రెజ్లింగ్ లో భజరంగ్ పూనియా కాంస్యం సాధించాడు. రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో ఈ పథకం కైవసం చేసుకున్నాడు. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన భజరంగ్ నేడు కాంస్య పథకం మ్యాచ్ లో కజికిస్థాన్ కు చెందిన జైకోవ్ పై ఘన విజయం సాధించాడు. జైకోవ్ పై భజరంగ్ 8-0 తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దీంతో… -
ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర…
ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర ఎప్పుడూ తీసికట్టే. మనతో ఎందులోనూ సరితూగని దేశాలు కూడా విశ్వ క్రీడా వేదికపై తలెత్తుకుని సగర్వంగా నిలబడుతుంటే.. ఇండియా మాత్రం పతకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. అడపాదడపా సాధించే విజయాలను అపురూపంగా కళ్లకద్దుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు టోక్యోలో కూడా మహిళలే భారత్ పరువు నిలబెట్టారు. టోక్యో ఒలింపిక్స్ తొలిరోజే వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం గెల్చింది. దేశ చరిత్రలో ఒలింపిక్స్ తొలిరోజే పతకం రావడం… -
పతకాల ఆశలు పెంచుతున్న భారత క్రీడాకారులు…
టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు పతకాల ఆశలు పెంచుతున్నారు. ప్రధానంగా సింధు, మేరీకోమ్, లవ్లీనా సహా పలువురు క్రీడాకారులు.. ఒక్కో అడుగు ముందుకేస్తూ, అభిమానుల్లో ఆశలు కల్పిస్తున్నారు. మీరా చాను సిల్వర్ మెడల్ తర్వాత మరో మెడల్ కోసం భారత్ ఆశగా ఎదురుచూస్తోంది. ఇవాళ మెన్స్ గోల్ఫ్ సింగిల్స్లో అనిర్బన్ లాహిరి, ఉదయన్లు.. రౌండ్ వన్ గేమ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.25 మీటర్ల పిస్టల్ మహిళల విభాగంలో మనుభాకర్, రాహి సర్నబట్.. బరిలో దిగనున్నారు రియో ఒలింపిక్స్… -
రెండో వన్డేలో టీమిండియా గెలిస్తే సరికొత్త రికార్డ్…
టీమిండియా మరో రికార్డు ముంగిట నిలిచింది. లంకపై అత్యధిక వన్డేల్లో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించేందుకు… ఒక్క మ్యాచ్ దూరంలో ఉంది. ఇవాళ జరిగే రెండో వన్డేలో భారత్ గెలిస్తే… ఆ లాంఛనం పూర్తవుతుంది. శ్రీలంకతో ఆరంభ మ్యాచ్లోనే అదరగొట్టిన భారత కుర్రాళ్లు.. రెండో వన్డేకు సిద్దమయ్యారు. ఇవాళ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సెకండ్ వన్డే జరగనుంది. తొలి వన్డేలో లంకపై ఘన విజయం సాధించిన భారత జట్టు… అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీలంకపై వన్డేల్లో… -
భారత జట్టులో కరోనా కలకలం…
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కోసం కోహ్లీ సారధ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్స్ లో ఓడిన టీంఇండియా తర్వాత ఇంగ్లాండ్ తో ద్వైపాక్షిక సిరీస్ లలో పాల్గొననుంది. అందుకోసం అక్కడే ఉండిపోయింది. అయితే ఇప్పుడు భారత జట్టులో కరోనా కలకలం రేపినట్లు తెలుస్తుంది. జట్టులోని ఓ ఆటగాడు కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ కు ఎక్కువ సమయం ఉండటంతో బీసీసీఐ ఆటగాళ్లకు మూడువారాలు… -
శ్రీలంక చేరుకున్న భారత జట్టు…
శిఖర్ధావన్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల టీమ్ఇండియా శ్రీలంక వెళ్లారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వీరంతా వెళ్లారు. వచ్చేనెల ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నారు. ఈ క్రమంలో గత రెండు వారాలుగా ముంబైలోని ఓ స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉన్న వారు దానిని పూర్తిచేసుకున్నారు. కాగా, ఆటగాళ్లు విమానంలో వెళ్తున్న ఫొటోలను అలాగే అక్కడికి చేరుకున్న ఫోటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. మరోవైపు ఈ జట్టులో పలువురు సీనియర్లతో పాటు… -
షెఫాలీ వర్మ ఖాతాలో మరో రికార్డ్…
భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగిన షెఫాలీ.. పిన్నవయసులోనే అన్ని ఫార్మాట్లు ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్గా రికార్డు సృష్టించింది. 2019లో టీ20లలో అడుగుపెట్టిన ఈ ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ ఇంగ్లండ్తో ఈ నెల 16-19 మధ్య జరిగిన ఏకైక టెస్టుతో ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసింది. అప్పటికి ఆమె వయసు 17 ఏళ్ల 150 రోజులు. ఈ టెస్టులో తొలి… -
నేటితో ముంబైలో టీమిండియా క్వారంటైన్ పూర్తి…
త్వరలో శ్రీలంక పర్యటనకు బయలుదేరే టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ముంబయిలోని ఓ స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉన్నారు. నేటితో వారికి క్వారంటైన్ గడువు ముగుస్తుంది. ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సకల సౌకర్యాలు కల్పించింది. వారికెంతో ఇష్టమైన ‘మాక్డక్’ అనే వెజిటేరియన్ రెసిపీని ప్రత్యేకంగా తయారు చేయించింది. అదెలా చేశారనే విషయాన్ని కూడా ఒక వీడియోలో బీసీసీఐ పంచుకుంది. ఈ వీడియోలో ప్రధాన చెఫ్ రాకేశ్ కాంబ్లే తన సిబ్బందిని పరిచయం చేస్తూ వివరంగా ‘మాక్డక్’ను ఎలా వండుతారో… -
లంక పర్యటనలో అందరికీ అవకాశం రాదు : ద్రవిడ్
శ్రీలంక పర్యటనలో కూడా ప్రతి ఒక్క ఆటగాడికి అవకాశం కల్పిస్తానని చెప్పిన ద్రవిడ్.. ఇప్పుడేమో అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యపడదని అంటున్నాడు. జట్టుకు ఎంపికై బెంచ్కే పరిమితం కావడం చాలా బాధిస్తుందని, ఆ బాధలను తాను కూడా అనుభవించానని చెప్పిన ఆయన..ఇప్పుడా మాటను దాట వేసినట్లుగా మాట్లాడాడు. కేవలం ఆరు మ్యాచ్ల లంక పర్యటనలో అందరికీ అవకాశం వస్తుందనుకోవడం సరికాదని, ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించాడు. తుది జట్టు ఎంపిక సెలక్టర్లు, మేనేజ్మెంట్ పరిధిలోని…
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!