Hong Kong Sixes Tournament: హాంకాంగ్ సిక్సెస్లో టీమిండియా.. టోర్నీ రూల్స్ భలే ఉన్నాయే! తప్పక తెలుసుకోవాల్సిందే
- ఏడేళ్ల తర్వాత హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ
- టోర్నీలో పాల్గొననున్న భారత్
- రూల్స్ అయితే భలే ఉన్నాయే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Here is Hong Kong Sixes Tournament Rules: ఐకానిక్ క్రికెట్ టోర్నమెంట్ ‘హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్’ మరలా అభిమానులను అలరించడానికి సిద్దమైంది. ఈ టోర్నీ నవంబర్ 1 నుంచి 3 వరకు జరగనుందని క్రికెట్ హాంకాంగ్ సోమవారం తన ఎక్స్ ద్వారా తెలిపింది. 1992లో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. 2017 వరకు కొనసాగింది. 2017 నుంచి 2023 వరకు ఏడేళ్ల పాటు నిర్వహించలేదు. 2024లో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి తిరిగి వస్తోంది. ఈ టోర్నీలో భారత్ కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది.
2024 హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు పాల్గొననున్నాయి. ప్రతి జట్టులో ఆరుగురు ప్లేయర్స్ ఉంటారు. ఒక మ్యాచ్లో ప్రతి జట్టు 5 ఓవర్లు ఆడుతుంది. ఈ టోర్నీ సాధారణ మ్యాచ్ల్లో ప్రతి ఓవర్కు 6 బంతులే వేస్తారు. కానీ.. ఫైనల్ మ్యాచ్కు మాత్రం ఓవర్కు ఎనిమిది బంతులు ఉంటాయి. వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. వైడ్ లేదా నో బాల్కు రెండు ఎక్స్ట్రా పరుగులు లభిస్తాయి.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
5 ఓవర్లు పూర్తికాక ముందే ఐదు వికెట్లు పడితే టీమ్ ఆలౌట్ కాదు. ఆరో ఆటగాడు (నాటౌట్ బ్యాటర్) బ్యాటింగ్ను కొనసాగిస్తాడు. అయితే ఐదవ వికెట్గా ఔటైన బ్యాటర్ రన్నర్గా ఉంటాడు. అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు. ఆరో ప్లేయర్ మాత్రమే ఎప్పుడూ స్ట్రైకింగ్ చేస్తాడు. ఆరవ వికెట్ కూడా పడితే.. అప్పుడు టీమ్ ఆలౌట్ అవుతుంది. ఇక ఓ బ్యాటర్ 31 పరుగులు చేస్తే.. అతడు రిటైర్డ్ హర్ట్ అవ్వాల్సి ఉంటుంది. మిగిలిన బ్యాటర్లందరూ ఔట్ లేదా రిటైర్డ్ హర్ట్ అయిన తర్వాత మరలా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.
Also Read: Honda vs Hero: హీరో మోటోకార్ప్కు షాకిచ్చిన హోండా!
గతంలో జరిగిన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీలు పాల్గొన్నారు. వీరితో పాటు సనత్ జయసూర్య, షేన్ వార్న్, వసీమ్ అక్రమ్, షోయబ్ మాలిక్, గ్లెన్ మాక్స్వెల్ కూడా పాల్గొన్నారు. ఈ టోర్నీలో భారత్ 2005లో ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో పాకిస్థాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా టీమ్స్ అత్యంత విజయవంతమైన జట్లు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!