PCB Chairman: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా..? పీసీబీ చీఫ్ సమాధానం ఇదే
- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది సస్పెన్స్
- ఈ టోర్నీకి భారత్తో పాటు అన్ని జట్లూ పాకిస్థాన్కు వస్తాయనడంలో సందేహం లేదు- పీసీబీ చీఫ్
- భారత జట్టుపై పూర్తి విశ్వాసం ఉంది- నఖ్వీ
- ఇప్పటి వరకు వారు వాయిదా వేయడం.. రద్దు చేయడం ఆలోచన లేదు- నఖ్వీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ టోర్నీకి భారత్తో పాటు అన్ని జట్లూ పాకిస్థాన్కు వస్తాయనడంలో సందేహం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నక్వీ అన్నారు. రాజకీయ సమస్యల కారణంగా భారత్, పాకిస్థాన్ల మధ్య చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదని చెప్పారు. ఈ రెండు జట్లు బహుళ-దేశాల టోర్నమెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి రావడంతో భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే సందేహం నెలకొంది.
Adani Group’s Stocks: షేర్ మార్కెట్లు మరోసారి కుదేలు.. అదానీ గ్రూప్ షేర్లు పతనం..!
Also Read
చివరిసారిగా 2023 ఆసియా కప్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ టీమిండియా పాకిస్థాన్ వెళ్లకపోవడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. ఈసారి కూడా హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించవచ్చు.. కానీ పాకిస్తాన్ దానికి ఇంకా సిద్ధంగా లేదు. లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో విలేకరులతో మాట్లాడిన నఖ్వీ.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్టేడియంను సిద్ధం చేయడానికి జరుగుతున్న పునరుద్ధరణ పనుల గురించి తెలియజేశారు. ఏడేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) క్యాలెండర్లోకి తిరిగి వస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాల్గొనడంపై పీసీబీ ఛైర్మన్ను విలేఖరి ఒక ప్రశ్న అడిగారు.
Prakash Raj: 1000 మంది ఆర్టిస్టులున్న సెట్ నుంచి ప్రకాష్ రాజ్ మిస్సింగ్.. కోటి రూపాయల నష్టం!
ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. “మేము సిద్ధంగా ఉన్నాము, ఛాంపియన్స్ ట్రోఫీకి అన్ని జట్లు వస్తాయి ” అని మొహ్సిన్ నఖ్వీ చెప్పారు. “భారత జట్టుపై నాకు పూర్తి విశ్వాసం ఉంది… ఇప్పటి వరకు వారు వాయిదా వేయడం, రద్దు చేయడం ఆలోచన లేదు. కాబట్టి అన్ని జట్లు వస్తాయి. ” అని నఖ్వీ తెలిపారు. కొత్తగా ఐసీసీ చైర్మన్గా జై షా నియామకమయ్యారు.. ఆయనను కలవాలని అని నఖ్వీని విలేఖరి ప్రశ్నించారు. “షాతో సమావేశాల వివరాలు ఇంకా ఖరారు కాలేదని.” నఖ్వీ తెలియజేశారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..