ViralVideo: ఛీఛీ చదువు చెప్పాల్సిన గురువే.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ViralVideo: గురువును దైవంగా భావించే దేశంలో, ఒక ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులను తన వ్యక్తిగత సేవలకు వాడుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సింది పోయి, విద్యార్థినుల చేత కాళ్లు పట్టించుకుంటున్న వీడియో బయటకు రావడంతో ఆ ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
READ ALSO: Testosterone: పురుషుల ఆరోగ్య సీక్రెట్.. టెస్టోస్టిరాన్ పెంచే బెస్ట్ ఆహారాలు ఇవే!
Also Read
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Virat Kohli: "నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు".. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
- Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
- Kylian Mbappe డబుల్ స్ట్రైక్.. ఇరాక్పై 3-0తో ఫ్రాన్స్ విజయం.! నాకౌట్కు అర్హత..
అసలేం జరిగిందంటే..
చిత్రకూట్ జిల్లా నయా బజార్ ప్రాంతంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన వెలుగు చూసింది. వైరల్ అయిన 21 సెకన్ల వీడియోలో.. ప్రధానోపాధ్యాయురాలు మధు రాయ్ తరగతి గదిలోని నేలపై చాప వేసుకుని పడుకుని ఉంది. ఒక విద్యార్థిని ఆమె కాళ్లను మసాజ్ చేస్తూ కనిపిస్తుండగా, సదరు ఉపాధ్యాయురాలు మాత్రం దర్జాగా మొబైల్ ఫోన్ వాడుతూ సేద తీరుతోంది. ఈ వీడియో విద్యాశాఖలో కలకలం రేపడంతో, జిల్లా విద్యాధికారి (BSA) బి.కె.శర్మ తక్షణమే స్పందించారు. నగర విద్యాధికారి అతుల్ దత్ తివారీని విచారణకు ఆదేశించారు. ఆయన పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి వారి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. వీడియోలో ఉన్నది నిజమేనని తేలడంతో, ఆ నివేదిక ఆధారంగా మధు రాయ్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారలు ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులతో మసాజ్లు చేయించుకోవడం ఇదే మొదటిసారి కాదని, గత కొంతకాలంగా ఇదే సాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పిల్లలను చదువుకోనివ్వకుండా ఇలాంటి వ్యక్తిగత పనుల కోసం వాడుకుంటూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో జిల్లాలోని ఇతర ఉపాధ్యాయులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి క్రమశిక్షణారాహిత్య చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని ఉన్నతాధికారులు తెలిపారు.
READ ALSO: Ustaad Bhagat Singh: ఉగాదికి ‘ఉస్తాద్’ ఊచకోత.. డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్!
తాజావార్తలు
-
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
Virat Kohli: “నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు”.. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
-
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
-
Vijay – Trisha : అన్ఫాలో చేసిన త్రిష.. విజయ్తో ఇక బ్రేకప్?
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!