ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్య చేసుకుంది, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. లైంగిక వేధింపులకు గురి చేసిన వినోద్ జైన్ గురించి ఎందుకు చెప్పలేకపోయిందో ఆ చిన్నారి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి ఎవరికైనా చెబితే ఇంట్లో వాళ్లని ఏమైనా చేస్తామని భయపెట్టాడా..? వినోద్ జైన్ మందబలం చూసి భయపడిందా..? వినోద్ జైన్ కు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే వివరంగా సూసైడ్ నోట్ రాసిందని వాసిరెడ్డి పద్మ అన్నారు.…
విజయవాడలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేత వినోద్ జైన్ తనను వేధిస్తున్న విధానాన్ని ఆమె తన పుస్తకంలో రాసినట్టు, సదరు టీడీపీ నేత కూడా బాలిక నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే ఉంటునట్లు తెలిసింది. టీడీపీ నేత వినోద్ జైన్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. బాలిక ఆత్మహత్య…
చిన్నారిని టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన ఏపీలో దుమారం రేపుతోంది. ఈ సందర్బంగా ఆ చిన్నారి తాత మాణిక్యాలరావు మాట్లాడుతూ నా మనుమరాలిని నాలుగు నెలల వయసు నుంచీ పెంచాను. 2008 ఏప్రిల్ లో పుట్టింది. నిన్న మధ్యాహ్నం నుంచీ నా మనుమరాలు ముభావంగా ఉంది. నిన్న సాయంత్రం వాకింగ్ కి బయలుదేరినపుడు పలకరించింది. ఎప్పుడూ లేనిది కొత్తగా వాళ్ళ అమ్మను ఐ లవ్ యూ మమ్మీ అంటూ కౌగిలించుకుందని ఆయన…
టీడీపీ నాయకుల మీద కంట్రోల్ లేదని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. 14 ఏళ్ల చిన్న పాప లైంగిక వేధింపులకు గురైందని, మేడ మీద నుంచే దూకే ముందు అటు ఇటు తిరిగింగిందని వాసిరెడ్డ పద్మ ఆరోపించారు. ఆ బాలిక మరణం తప్ప గత్యంతరం లేదని దూకి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. దీనికి కారణమైన వినోద్ జైన్ ను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వినోద్ జైన్ ఎలాంటి వాడో బెజవాడ…
వినోద్ జైన్ ను సస్పెండ్ చేసి టీడీపీ చేతులు దులుపుకుంటోందని.. చిన్నారి ఆత్మహత్య ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీడీపీ నేత వినోద్ జైన్ చిన్నారిని ఇబ్బంది పెట్టాడని.. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని విధంగా కఠినంగా వ్యవహరించాడని…. 54 ఏళ్ల వ్యక్తికి ఈ బుద్ది ఎలా వచ్చిందో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. వినోద్ కుమార్ జైన్ను కఠినంగా…
మహిళలపై అత్యాచారాలలో ఏపీ రెండవ స్థానంలో ఉందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత చెల్లికి రక్షణ ఇవ్వలేని వ్యక్తి సీఎం జగన్ అని, ఇక రాష్ట్ర మహిళలకు ఏం ఇస్తాడు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో నేరగాళ్లకు ప్రెంఢ్లీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని దుయ్యబట్టారు. ఏపీలో మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని ఆమె అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అత్యాచారం చెయ్యాలంటే భయపడే పరిస్థితి చంద్రబాబు కల్పించారన్నారు.…
నూతన జిల్లాల ఏర్పాటులో ప్రజలు అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తెస్తే పరిష్కరించి ముందుకు వెళ్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడలో ఏదో జరిగిందని ఛీర్ బాయ్ లతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు టీడీపీకి రాష్ట్రంలో ఏ అంశమూ లేదని, ఏ అంశం లేకే గుడివాడ అంశంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం…
తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపగల వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ను ఓ ప్రాంతానికో.. కులానికో పరిమితం చేయొద్దని మంత్రి పేర్నినాని అన్నారు. ప్రధానులనే నియమించి చక్రం తిప్పానన్న చంద్రబాబు.. ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు? ఎన్టీఆర్ పేరుతో జిల్లా పెట్టాలన్న ఆలోచనను చంద్రబాబు ఎందుకు చేయలేదని మండిపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం…
ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే తెరపైకి జిల్లాల విభజన అంశం తీసుకువచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ఏకపక్షంగా జిల్లాల విభజన చేపట్టారన్నారు. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన ప్రక్రియ ఉండాలని, సమస్యలు తలెత్తేలా నిర్ణయాలు ఉండకూడదన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఎందుకు వ్యతిరేకిస్తామని, ఎన్టీఆర్ ను…
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ గుడ్బై చెప్పి వైసీపీలో చేరిపోయారు.. తాజాగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ.. గత ఏడాదిలోనే టీడీపీకి రాజీనామా చేశారు శోభా హైమావతి.. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు..…