గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. గుడివాడలో అసలు క్యాసినో నిర్వహణ జరగలేదని ఆయన అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందాలు, పేకాట శిబిరం మాత్రమే జరిగాయని, కొడాలి నాని అనారోగ్యంతో ఉండటంతో నా స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. శిబిరం నిర్వహించిన వారు నా స్నేహితులు, వారు ఎవరో కూడా కొడాలి నానికి తెలియదని, అది…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్యాసినో నిర్వహించారని ఆరోపణలు చేస్తుంటే.. అధికార పార్టీ వైసీపీ నేతలు మాత్రం అలాంటిది ఏం లేదని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నిజానిజాలు తేల్చుకునేందుకు గుడివాడకు వెళ్లగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆ ఘటన తరువాత నిజ…
ఏపీలో వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్ లో అధికార వైసీపీ నేతలు ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్ జగన్ వచ్చిన దగ్గర నుంచి స్పెషల్ ఫోర్స్ పెట్టి క్లబ్ లు మూయించిన మాట వాస్తవం కాదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో ప్రతీ జిల్లాకు ఎయిర్ పోర్టుకి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులని సీఎం ఆదేశించారన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్దిని చూసి టీడీపీ సహించలేకపోతోందని ఆయన అన్నారు. పెన్షన్ 2500 రూపాయిలకి పెంచితే బావురమని చంద్రబాబు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజనిర్దారణ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడారన్నారు. గుడివాడపై ప్రేమా లేక మంత్రికొడాలి నానిపై కక్షా.. కోడిపందాలు,…
గుడివాడ క్యాసినో అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నిజ నిర్ధారణకమిటీ సభ్యులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే తాజాగా టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. విజయవాడ కలెక్టర్ కు గుడివాడ క్యాసినో, తనిఖీ వెళ్లిన…
ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరింత అప్పుల పాల్జేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు గుప్పించారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా జిల్లాకో ఎయిర్ పోర్టు కడతాననడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. పోలవరం, ఉత్తరాంధ్రా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి ఏమిటీ తుగ్లక్…
గుడివాడలో జరిగిన ఘటనలో కుట్రకోణం ఏమైనా ఉందా అనే అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు వెల్లడించారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ఆరుగురు సభ్యులతో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీకి అనుమతి ఇచ్చామని, కానీ నిబంధనలు అతిక్రమించి వందలాది మందితో టీడీపీ నాయకులు వచ్చారన్నారు. గుడివాడలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను కృష్ణా జిల్లా పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ, చాకచక్యంగా అదుపు చేశారని…
గుడివాడలో సంక్రాంతి పండుగ రోజున మంత్రి కొడాలి నాని కి చెందిన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించారని, టీడీపీ నిజ నిర్దారణ కమిటీ ఈ ఘటనపై వాస్తవాలను బయటపెట్టేందుకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. నిజ నిర్దారణకు వచ్చిన తమపై దాడి పోలీసులు పట్టించుకోలేదని, డీజీపీ పనికి మాలిన వాడంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.…
వర్గ రాజకీయాలకు పెట్టింది పేరైన ప్రకాశం జిల్లా చీరాలలో ఓటర్లు విభిన్నంగా తీర్పులు ఇస్తుంటారు. చీరాల నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన 16 శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే.. ఎనిమిదిసార్లు ఇతర పార్టీల క్యాండిడేట్స్ గెలిచారు. ప్రగఢ కోటయ్య, కొణిజేటి రోశయ్య వంటి ఉద్ధండులు చీరాలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా టీడీపీకి కూడా ఇక్కడ బలమైన కేడర్ ఉంది. చేనేత సామాజికవర్గం అధికంగా ఉండే చీరాల నియోజకవర్గంలో ఎస్సీ ఓటు బ్యాంకు కూడా…
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంత్రి కొడాలి నానికి చెందిన కల్యాణ మండపంలో క్యాసినో, పేకాట, జూదం అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నేడు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ కృష్ణ జిల్లా లోని కొడాలి నాని కల్యాణ మండపానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంగా టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ.. గుడివాడలో గత కొంత కాలంగా క్యాసినో,…