విశాఖపట్నంలో ఫైబర్ నెట్ కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ను మరింత ఆధునీకరించడం జరిగిందని అన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా అతి తక్కువ ధరకు మూడు సర్వీసుల్ని అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. Read Also: Etela Rajender: ప్రాణహిత-చేవెళ్లకు అడ్డుపడింది…
పసుపు కండువా నీడలోనే నేతలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలుగుదేశంపార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు ప్రస్తుతం ముగ్గురు నలుగురే ఉన్నారు. వారిలో ఒకరు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు. మిగతా వాళ్లు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి.. కొత్తకోట దయాకర్రెడ్డి దంపతులు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన వారంతా వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. వీళ్లు మాత్రం పసుపు కండువా నీడలోనే కాలం వెళ్లదీస్తున్నారు. బక్కని నర్సింహులు టీ టీడీపీ…
ఎమ్మెల్యే తలారి వైఖరిపైనే ఆరోపణలు గోపాలపురం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దగా రాజకీయ అలికిడి లేని నియోజకవర్గం. ఇటీవల జికొత్తపల్లి గ్రామంలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యతో ఒక్కసారిగా అటెన్షన్ తీసుకొచ్చింది గోపాలపురం. వైసీపీలోని గ్రూప్వార్ హత్యకు కారణం ఒక సంచలనమైతే.. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై స్థానికులు దాడి చేయడం కలకలం రేపింది. దీంతో గోపాలపురంలో ఏం జరుగుతుంది? అక్కడ అధికారపార్టీలో వర్గపోరు చంపుకొనే స్థాయిలో ఉందా? అయితే దానికి కారణం ఎవరు?…
నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. గతంలో జనరల్ సెగ్మెంట్గా ఉన్నప్పుడు 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడమే ఆఖరు. ఆ తర్వాత నందికొట్కూరులో టీడీపీ జెండా ఎగిరింది లేదు. 2004లో కాంగ్రెస్ నుంచి గౌరు చరిత గెలిచారు. 2009కి వచ్చేసరికి నియోజకవర్గాల పునర్విభజనలో నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ అయింది. 2012లో బైరెడ్డి రాజశేఖర్రెడ్డికి టీడీపీకి రాజీనామా చేశాక సైకిల్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఎస్సీ సామాజికవర్గంలో టీడీపీకి బలమైన నాయకుడు లేకపోవడం పెద్ద…
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో మెట్ట రాజకీయాలు డిఫరెంట్. ఇందులో జగ్గంపేట రాజకీయాలు ఇంకా ఆసక్తికరం. గడిచిన నాలుగు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే రెండుసార్లు కాంగ్రెస్, మరో రెండుసార్లు వైసీపీ గెలిచాయి. అభ్యర్థులు ఎవరైనప్పటికీ పార్టీలే జగ్గంపేటలో కీలకమని టాక్. 2004, 2009 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో జగ్గంపేట ప్రజలు వైసీపీని గెలిపించారు. 2004లో టీడీపీ నుంచి 2009లో పీఆర్పీ…
టీడీపీ ఎన్నికల వ్యూహంపై చర్చ టార్గెట్ బిగ్షాట్స్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రస్తుతం అమలు చేయాలని అనుకుంటున్న ప్రణాళిక. ఇటీవల సీఎం జగన్ వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షులు, మంత్రులతో సమావేశమయ్యారు. పార్టీ బాధ్యతలను రీజినల్ కో-ఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షుల మీద పెట్టారు. మంత్రులకంటే వారే ఎక్కువ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో సమన్వయకర్తలు.. జిల్లా అధ్యక్షులు గెలవడంతోపాటు వారి పరిధిలోని ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను కూడా గెలిపించాల్సిన బాధ్యత వారికే…
లావు శ్రీకృష్ణదేవరాయులు. నరసరావుపేట వైసీపీ ఎంపీ. ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల చుట్టూ నరసరావుపేట వైసీపీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఒకరు ఎగ్జిట్ అయ్యి.. ఇంకొకరు ఎంట్రీ ఇస్తారనే చర్చ అధికారపార్టీ వర్గాల్లో ఊపందుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కేంద్రంగా జరుగుతున్న ప్రచారం.. చర్చలు మరెంతో ఉత్కంఠ రేపుతోంది. మోదుగుల వేణుగోపాల్రెడ్డి 2009లో నరసరావుపేట టీడీపీ ఎంపీ. 2014కు వచ్చేసరికి గుంటూరు పశ్చిమ నుంచి…
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సమర్ధించారు. మాకు రోడ్లు లేవు. నీరు లేవు… నిజమే. మా రాష్ట్రం పరిస్థితి అంతా అయిపోయింది. నాకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ వెళ్లే రోడ్లు చాలా బాగున్నాయి. మీరు తగ్గద్దు. పుష్ప డైలాగ్ రిపీట్ చేశారు. కేటీఆర్ మాట తప్పద్దు. మీరు రాబోయే లీడర్. నువ్వు మాట్లాడింది నిజమే. దాన్నుంచి…
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం. టీడీపీ అంచనాలకు అందని సెగ్మెంట్లలో ఇదొకటి. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిస్తే. తర్వాత వైసీపీ పాగా వేసింది. గతంలో టీడీపీ నుంచి బసప్ప, రంగయ్య, మసాలా ఈరన్నలు ఎమ్మెల్యేలుగా చేశారు. 2009 వరకు ఆలూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అప్పట్లో కోట్ల విజయభాస్కర్రెడ్డికి బాగా పట్టు ఉండేది. దాంతో టీడీపీ ఎత్తులు పారేవి కాదు. కాంగ్రెస్ బలహీన పడినా టీడీపీలో గ్రూపు రాజకీయాలు సైకిల్ను ఎదగనివ్వలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ…
ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ప్రస్తుతం ఆ పార్టీ విబేధాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక ఉమ్మడి జిల్లాలో 12 చోట్ల గెలిచిన వైసీపీలో.. లోకల్గా గుర్తించని అంశాలు చాలా ఉన్నాయి. వైసీపీలోనూ ఒక రేంజ్లో అంతర్గత కలహాలు నడుస్తున్నాయి. అవి పార్టీ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఒక్కసారిగా బయటపడ్డాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, శ్రీ అన్నమయ్య జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు పెద్దిరెడ్డి. ఆ హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు రాగానే షాక్…